మనలాంటి మధ్యతరగతి వాళ్ళమే అతిధుల దగ్గరి నుండి మాట రాకూడదు అని పెళ్ళిలో ఎలాంటి లోటు ఉండకూడదు అనుకుంటాము.అలాంటిది డబ్బునోళ్ల పెళ్లి అంటే మామూలు మాటలా.
ఇక మన దేశంలో డబ్బునోళ్లు అంటే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది అంబానీ ఫామిలీ.రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కూతురు ఈషా అంబానీ వివాహ వేడుక ఎంత హై రేంజ్ లో జరిగిందో అందరికి తెలిసిందే.
ఈ జంట వివాహ వేడుకలకు వచ్చిన అతిథులకు బాలీవుడ్ తారా గణం కొసరి కొసరి వడ్డించడం హాట్ టాపిక్గా మారింది.బాలీవుడ్ అగ్రతారలు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అమీర్ఖాన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్లతో పాటు ఏడేళ్ల ఆరాధ్య కూడా భోజనం వడ్డిస్తూ అతిథులకు మర్యాద చేశారు.దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో రెండు రోజుల నుండి వైరల్ అవుతూనే ఉన్నాయి.
అయితే ఎంత బాలీవుడ్ లో టాప్ హీరో అయినా…అంబానీ ఇంట్లో సెర్వింగ్ చేయాల్సిందే అంటూ కొంతమంది ట్రోల్ల్స్ చేసారు.అసలు అమితాబ్ వడ్డించడం వెనక అసలు కారణం ఏంటో ఇప్పుడు మనం చూద్దాము.
తాజాగా దీనిపై అభిషేక్ ట్విటర్లో స్పందించారు.‘పెళ్లి వేడుకల్లో అతిథులకు భోజనం వడ్డించే సంప్రదాయాన్ని ‘సజ్జన్ ఘోట్’ అంటారు.వధువు తరఫు కుటుంబ సభ్యులు వరుడి తరఫు వారికి భోజనాలు వడ్డిస్తారు’ అని పేర్కొన్నారు.