గుజరాత్ ఎన్నికల గెలుపు తరువాత బిజెపి నేతలు తమ గ్రాఫ్ తగ్గిపోయింది అని తెగ ఫీల్ అయిపోతున్నారు.అయితే ఏపీ బిజెపి లో మాత్రం వాపుని చూసి బలుపు అనుకుంటున్నారు.
గుజరాత్ గెలుపు తరువాత ఏపీ బీజేపి ఎంత సోము వీర్రాజు ఏపీ లో టిడిపిని,చంద్రబాబు ని ఎంతగా టార్గెట్ చేశారో అందరికీ తెలిసిన విషయమే అయితే.పార్టీలో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉంటే ఆటలో అరటిపండులా సోము వీరాజు రెచ్చిపోవడం
గుజరాత్ ఎన్నికల్లో గెలుపు తరువాత చాలామంది బీజేపీ నేతలు తమ గ్రాఫ్ పడిపోతోందని ఫీలవుతుంటే… ఏపీలోని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాత్రం అందుకు భిన్నంగా మిత్రపక్షమైన టీడీపీపై విమర్శలు చేస్తున్నారు.
ఏదో ఒక రకంగా టీడీపీని టార్గెట్ చేస్తున్న సోము వీర్రాజు… మళ్లీ ఇలాంటి రన్నింగ్ కామెంట్రీ ఎందుకు మొదలుపెట్టాడనే విషయం ఆ పార్టీ నేతలకు కూడా అర్థంకావడం లేదు.పురంధేశ్వరి, కన్నా, కావూరి వంటి వాళ్లు సైలెంట్ గా ఉంటున్నా… సోము వీర్రాజు మాత్రం ఈ రేంజ్ లో రెచ్చిపోవడానికి కారణం ఏంటని ఆరా తీసిన కొందరు నాయకులు… ఆయనను ఆడిస్తోంది బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అని చర్చించుకుంటున్నారు.
బీజేపీలో అత్యంత ప్రాధాన్యం ఉన్న నేతగా గుర్తింపు తెచ్చుకున్న రాంమాధవ్ సూచనలతోనే సోము వీర్రాజు ఈ రకంగా బీజేపీని టార్గెట్ చేస్తున్నారని ఆ పార్టీలోని కొందరు నేతలు బాహాటంగానే అభిప్రాయపడుతున్నారు.టీడీపీపై ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్న వీర్రాజు… దీనిపై ఏపీలోని తోటి బీజేపీ నేతలతో సంప్రదించడం లేదని సమాచారం.
వీర్రాజుకు సన్నిహితంగా ఉండే మంత్రి మాణిక్యాలరావుకు సైతం ఈ విషయంలో ఎలాంటి సమాచారం లేదని ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు.
అయితే ఇప్పుడు ఎవ్వరికీ అర్థం కాని ప్రశ్న ఒక్కటే సోము వీర్రాజు ఎవరి అనుమతి లేకుండా బాబు పై ఇలాంటి వ్యాఖ్యలు చేయరు.
అయితే.బీజేపీ నేత రాంమాధవ్ సొంత ఎజెండాతో వీర్రాజుతో ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారా లేక బీజేపీ అధిష్టానమే ఆయనకు ఈ రకమైన సూచనలు చేస్తోందా అనే విషయం అర్థంకావడం లేదు.
ఇదిలా ఉంటే సోము వీర్రాజు చేస్తున్న వ్యాఖ్యలని అధిష్టానం ఖండించడం లేదు సరి కదా లోకల్ గా ఉన్న పెద్ద లీడర్స్ కూడా నో ఆబ్జెక్ట్ అన్నట్టుగా ఉంటున్నారు.దాంతో బీజేపినే ఈ వ్యాఖ్యలని చేస్తోందని తెలుస్తోంది.
మరి చంద్రబాబు ఈ పరిణామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని చూస్తున్నారు తెలుగుదేశం నేతలు.