నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో బాలయ్య-బోయపాటి కాంబో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.
కాగా గతంలో సింహా, లెజెండ్ వంటి సినిమాలు రాగా, అవి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే.ఇక ఇప్పుడు మరోసారి పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా బోయపాటి ఈ సినిమాను తీర్చిదిద్దుతుండటంతో నందమూరి అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.అయితే మిగతా హీరోలు ఈ లాక్డౌన్ సమయంలో తమ నెక్ట్స్ చిత్రానికి సంబంధించిన కథలు వింటూ, వాటిని ఫైనలైజ్ చేస్తూ వచ్చారు.
కానీ బాలయ్య మాత్రం తన నెక్ట్స్ చిత్రాన్ని ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు.గతంలో ఒక సినిమా సెట్స్పై ఉండగానే తన నెక్ట్స్ చిత్రాన్ని ఓకే చేసే బాలయ్య, ఈసారి తన నెక్ట్స్ చిత్రాన్ని మాత్రం ఓకే చేయలేదు.
రూలర్ చిత్రంతో ఘోరమైన డిజాస్టర్ను మూటగట్టుకున్న బాలయ్య, ఈసారి పక్కా ప్లానింగ్తో తన నెక్ట్స్ చిత్రాన్ని ఓకే చేయాలని చూస్తున్నాడు.
కాగా బాలయ్య ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్లో చేస్తోన్న సినిమాలో ఆయన డ్యుయెల్ రోల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ను ఇప్పటికే రిలీజ్ చేయగా, అది ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది.ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తున్నారనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
అయితే సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు బాలయ్య రెడీగా ఉన్నాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
మర బాలయ్య తన నెక్ట్స్ చిత్రాన్ని ఎవరితో చేస్తాడనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.