తెలంగాణ ఎన్నికల్లో నాయకులు చిత్ర విచిత్రమైన ప్రయోగాలకు తెర తీశారు అనే విషయాలు ఇప్పుడు బయటపడి అందరిలోనూ ఆసక్తితో కూడిన ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.నాయకులు ఎలా అయినా గెలవాలనే ఆలోచనతో మూఢ నమ్మకాలతో ప్రత్యర్ధులను దెబ్బతీయడానికి గబ్బిలాలను ఉపయోగించుకున్నారేనే వార్త సంచలనం సృష్టిస్తోంది.
ఇదే ఎన్నికల్లో ఈ విధంగానే కర్ణాటక నుంచి గుడ్లగూబలను ఒక్కొక్కటి 2 – 3 లక్షలకు తెప్పించడం అలా తెచ్చే ముఠా అడ్డంగా దొరికిపోవడం జరిగాయి.
అలాగే ఇదే కర్నాటకలో ఇలాంటి మూడ నమ్మకాలతో గబ్బిలాలను చంపే యత్నం చేస్తుండగా,వాటిని జీవకారుణ్య వేత్తలు రక్షించారట.ఈ నేపధ్యంలో మహారాష్ట్రలోని పూణె జిల్లాలోని పురందర తాలుకాలో గబ్బిలాలపై అవగాహన పెంచడానికి ఒక ఉత్సవం నిర్వహించారు.అందులో గ్రామాలలోని పిల్లలకు రకరకాల పోటీలను గబ్బీలాలపై నిర్వహించారు.
పిల్లలలో మూడ విశ్వాసాలను పోగొట్టడానికి ఈ ప్రయత్నం చేశామని డాక్టర్ పాండే అనే వ్యక్తి మీడియా కు వెల్లడించారు.