బీజేపీ – టీడీపీ మిత్ర పక్ష పార్టీలు … ఇది ఎవరికన్నా చెబితే నవ్వుతారేమో కానీ ఇది నిజమే.ఇప్పటికి మూడు సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన బీజేపీ మూడు సార్లూ ఏపీ కి దారుణమైన ఫలితం ఇవ్వడం గమనార్హం.
రైల్వే బడ్జెట్ , సాధారణ బడ్జెట్ వచ్చి వెళ్ళినా కూడా ఏపీ కి రూపాయి కూడా రాలేదు.ఈ విషయం లో అందరూ సైలెంట్ గా ఉండడం గమనార్హం.
ఏపీ కొత్త రాజధాని అమరావతి కి కనీస నిధులు కూడా ఇవ్వకపోవడం తో జనాలు చాలా చిరాకు గా ఉన్నారు.కానీ వారి తరఫున గోతెత్తి అడిగేవారు లేకపోవడం మాత్రం అత్యంత దారుణమైన విషయం.
అప్పట్లో టీడీపీ ని ప్రశ్నిస్తా, బీజేపీ ని ప్రశ్నిస్తా అన్న పవన్ కళ్యాణ్ బీజేపీ కి ఇంకా గులాము గా ఉండడం దారుణమైన విషయం.మరొక పక్క ప్రతిపక్ష నేత జగన్ కూడా బీజేపీ ని ఏమైనా అంటే ఏమవుతుందో అన్నట్టు సైలెంట్ గా ఉండడం విశేషం.
ఇక మీడియా సంగతి సరే సరి ఒక్క మాట కూడా బీజేపీ కి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు మీడియా.ఏపీ కి ఇప్పుడు సరైన నాయకుడి కొరత ఉంది అని యిట్టె చెప్పచ్చు.