విజయవాడ లోక్ సభ స్థానానికి 2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా కోనేరు ప్రసాద్ రాజీనామా చెయ్యడం వెనకాలా టీడీపీ హస్తం ఉంది అనీ ఆయన త్వరలో టీడీపీ లో జేరేలా ఉన్నారు అనీ అంటున్నారు విశ్లేషకులు.అసంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణం లో ఒక కీలక నేత కోనేరు రాజీనామా చెయ్యడం అంటే ఇదేదో మాస్టర్ ప్లాన్ లాగానే కనిపిస్తోంది.
దాదాపు గా రెండేళ్ళ పటు వైకాపా కి దూరంగా ఉంటున్న కోనేరు ఇప్పుడు తెరమీదకి ఒచ్చి రాజీనామా చేసారు అంటే ఎదో మతలబు ఉండి ఉండచ్చు.అసెంబ్లీలో సరిగ్గా మూడ్రోజుల క్రితం ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో బీచ్ సాండ్ పై పెద్ద ఎత్తున్నే చర్చ జరిగిన సంగతి తెలిసిందే.
ఏపీలో టీడీపీతో కలిసి అధికారం పంచుకుంటున్న బీజేపీకి చెందిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.ఏకంగా 2జీ స్కామ్ కంటే పెద్ద కుంభకోణమని ఆరోపించారు.
ఈ ఎపిసోడ్ జరిగిన రెండ్రోజుల తర్వాతే కోనేరు ప్రతిపక్ష వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు! విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం బీజేపీ విమర్శలను చంద్రబాబు ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.అయితే ఇప్పటికే ఉత్తరాంధ్రలో బీచ్ సాండ్ వ్యాపారంలో కోనేరు ప్రముఖ స్థానంలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో తన ప్రాజెక్ట్ లను కాపాడుకోవడం కోసమే రాజీనామా చేశారని సమాచారం.