జాన్సీ లక్ష్మిబాయి జీవిత చరిత్ర ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో ప్రారంభం అయిన ‘మణికర్ణిక’ చిత్రం పలు ఒడుదొడుకులు ఎదుర్కొని చివరకు మొన్న రిపబ్లిక్ డే సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న మణికర్ణిక చిత్రంలోని సదాశివరావు పాత్రను తగ్గించాలని, వక్రీకరించి చూపించాలని క్రిష్తో కంగనా మరియు నిర్మాతలు వివాదం పెట్టుకున్నారు.
కాని చరిత్రను తప్పుగా చూపిస్తే మంచిది కాదని క్రిష్ చెప్పే ప్రయత్నం చేశాడు.కాని కంగనా మాత్రం అందుకు ఒప్పుకోలేదు.
దాంతో క్రిష్ సినిమా నుండి బయటకు వెళ్లే పరిస్థితి వచ్చింది.
క్రిష్ బయటకు వచ్చిన తర్వాత సదాశివరావు పాత్రను అప్పటి వరకు పోషించిన సోనూ సూద్ కూడా సినిమా నుండి తప్పుకున్నాడు.అప్పటికే షూట్ చేసిన కొన్ని సీన్స్ను తొలగించి మరో నటుడితో కంగనా స్వయంగా షూట్ చేసింది.సదాశివరావు అనే వ్యక్తి లక్ష్మీ బాయి చరిత్రలో చాలా కీలకమైన వ్యక్తి.
కాని కంగనా మాత్రం అలా చూపించలేదు.చాలా డల్ పాత్రగా అతడిని చూపించారు.
కాని క్రిష్ సినిమా నుండి వెళ్లి పోక ముందు సోనూ సూద్తో అద్బుతమైన కొన్ని సీన్స్ను చిత్రీకరించాడు.
అయ్యో ఆ సీన్స్ ఉంటే సినిమా హైలైట్ అయ్యేదని, సోనూసూద్ ఉంటే సినిమా స్థాయి మరింత పెరిగేదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే అలా సోనూ సూద్కే క్రెడిట్ పోతుందనే ఉద్దేశ్యంతో కంగనా తప్పించి ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.