ఏపీ అధికార పార్టీలో ఓ పేరు చక్కర్లు కొడుతోంది.“జగన్ తర్వాత.జగన్ ఆయనేనంట!“ అనే టాక్ వినిపిస్తోంది.మరి ఆయన ఎవరు? జగన్ తర్వాత జగన్ అనే రేంజ్లో ఉన్న వ్యక్తి ఎవరు అని ఆరా తీస్తే.కడప జిల్లాకు చెందిన వైఎస్ అనిల్ కుమార్ అని తెలిసింది.జగన్కు అత్యంత సన్నిహితుడని అంటున్నారు.
అంతేకాదు.ప్రస్తుతం సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాల వెనుక, పార్టీ పరంగా వేస్తున్న అడుగుల వెనుక కూడా అనిల్ ఉన్నాడనే చర్చ జోరుగా సాగుతోంది.
వైఎస్ కుటుంబానికే చెందిన అనిల్.జగన్కు అత్యంత నమ్మకమైన వ్యక్తి అని ప్రచారంలో ఉంది.జగన్కు చెందిన అన్ని వ్యాపారాలు, వ్యవహారాలను కూడా అనిల్ చక్కబెడుతున్నారని అంటున్నారు.ముఖ్యంగా బెంగళూరు, ఇతర రాష్ట్రాల్లోని పవర్ ప్లాంట్లకు సంబంధించిన వ్యవహారాలను, గనుల వంటి వ్యాపారాలను కూడా అనిల్ కనుసన్నల్లోనే నడిపిస్తున్నారని తెలుస్తోంది.
ఇక, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నవే కదా.ఇప్పుడు ఎందుకు అనిల్ వ్యవహారం హాట్ టాపిక్గా మారిందనే అనుమానం వస్తుంది.
ఈ విషయంలోకి వస్తే.ప్రస్తుతం జగన్ న్యాయవ్యవస్తతో ఢీ అంటే డీ అన్నారు. దీంతో దేశవ్యాప్తంగా బార్ అసోసియేషన్లు అన్నీ కూడా జగన్కు వ్యతిరేకంగా తీర్మానం చేశాయి.అదేసమయంలో ఈ విషయాన్ని సుప్రీం కోర్టు కూడా సీరియస్గానే భావిస్తోంది.ఇదిలావుంటే, జగన్పై ఉన్న కేసులను సీబీఐ కోర్టు రోజువారిగా విచారిస్తోంది. ఈ నేపథ్యంలో ఏ క్షణానైనా జగన్ అరెస్టయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
అదేసమయంలో వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా విచారణ పుంజుకుంది.
సీబీఐ ఇప్పటికే ఎఫ్ ఐఆర్ నమోదు చేసింది.
ఈ కేసులో ప్రధానంగా కడప ఎంపీ అవినాష్ పేరు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయనను ఎప్పడైనా అరెస్టు చేసే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో అక్కడ ఉప పోరు జరిగితే.
అనిల్ను నిలబెట్టి గెలిపించుకుని.ఆ తర్వాత తన పీకల దాకా కూడా విషయం వస్తే.
తాను అరెస్టయితే.భారతికి పగ్గాలు అప్పగించినా.
మొత్తం పర్యవేక్షణను అనిల్కు అప్పగించాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలు అనిల్ విషయాన్ని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.