టాలీవుడ్ లో ఒకప్పుడు నెంబర్ వన్ హీరోయిన్ ప్లేస్ కోసం చాలా మంది ముద్దుగుమ్మలు పోటీ పడేవారు.ముగ్గురు నలుగురు టాప్ పొజిషన్ లో ఉండేవారు.
నిత్యం వారు అటు ఇటు మారుతూ ఉండేవారు.తాజాగా ఈ లిస్టులో కేవలం ఇద్దరు హీరోయిన్లు మాత్రమే చేరారు.
వారిలో ఒకరు రష్మిక మందన్న, మరొకరు పూజా హెగ్డే.ఈ ఇద్దరి మధ్యే నెంబర్ వన్ పోటీ నెలకొంది.
అల్లు అర్జున్ తాజా మూవీ పుష్ప సూపర్ డూపర్ కొట్టడంతో రష్మిక నెంబర్ వన్ రేసులో నిలిచింది.కానీ ఈ ముద్దుగుమ్మ కేవలం ఒక్క పాన్ ఇండియన్ మూవీలో నటించింది.
అటు పూజా మాత్రం వరుస పాన్ ఇండియన్ సినిమాల్లో చేస్తుంది.స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలతోనూ కలిసి నటిస్తుంది.గత ఏడాది ఈ ఇద్దరు హీరోయిన్లు వరుస హిట్లు సాధించారు.నెంబర్ వన్ రేసులో ఇద్దరు నిలిచారు.
ఈ ఏడాది మాత్రం పూజా సత్తా చాటబోతుంది.ప్రస్తుతం రష్మిక పుష్ప-2, ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలు చేస్తుంది.
అటు పూజా మాత్రం ఆచార్య, రాధేశ్యామ్, బీస్ట్ లాంటి భారీ చిత్రాల్లో నటిస్తుంది.
బాలీవుడ్ లోనూ ఈ ఇద్దరు క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నారు.రష్మిక మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాలతో సత్తా చాటబోతుంది.అటు రణ్ వీర్ సింగ్ నటిస్తున్న సర్కస్ మూవీలో పూజా హీరోయిన్ గా చేస్తుంది.
ఈ సినిమాలతో ఎవరు నెంబర్ వన్ అనేది తేలనుంది.
బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగు సినిమాలు కొట్టే హిట్లను బట్టి ఎవరి పొజిషన్ ఏంటి అని తేలనుంది.అయితే వీరు తాజాగా నటిస్తున్న సినిమాలు విడుదల అయితే గానీ.ఎవరు? ఏంటి? అనే విషయం తేలనుంది.ప్రస్తుతం మాత్రం పూజా వరుస సినిమాలు, అదీ భారీ సినిమాలు విడుదల కాబోతుండటంతో ఆమే నెంబర్ వన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.