సమంత హోస్టింగ్ చేసిన ఆహా టాక్ షో సామ్జామ్ మొదటి ఎపిసోడ్ కు విజయ్ దేవరకొండ ప్రత్యేక గెస్ట్ గా వచ్చాడు.రెండవ ఎపిసోడ్ కు వచ్చేది ఎవరు అంటూ ప్రస్తుతం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మొదటి సీజన్లో ఇప్పటికే గెస్ట్లు పది మంది ఖారారు అయ్యారు.మొదటి ఎపిసోడ్కు మంచి ఆధరణ రాలేదు.
దాంతో ఏం చేస్తారో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.వచ్చే శుక్రవారం రెండవ ఎపిసోడ్ స్ట్రీమింగ్కు రెడీ అవుతుంది.
సమంత నుండి ఇంకా ఎక్కువ ఆశిస్తున్నాం అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే కొన్ని ఎపిసోడ్ లను చిత్రీకరించి ఉంటారు కనుక ఖచ్చితంగా ఇప్పుడు ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు.
ఇప్పటికే షూట్ చేసిన ఎపిసోడ్స్ ను వరుసగా ప్రసారం చేయడం తప్ప ఏమీ చేయలేరు అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.సామ్జామ్ ప్రకటించిన రోజునే విజయ్ దేవరకొండ తో పాటు అల్లు అర్జున్, చిరంజీవి, రష్మిక మందన్న, తమన్నా మరియు సైనా నెహ్వాల్ లతో టాక్ షో ఉంటుందని అన్నారు.
ఈ వారం టాప్ స్టార్తో కాకుండా మళ్లీ సో సో ఎంటర్ వ్యూనే ఇస్తే ఖచ్చితంగా షో పై ప్రేక్షకుల్లో పూర్తిగా ఆసక్తి అకవాశం లేదు అనిపిస్తుంది. తెలుగు టాక్ షోలకు పెద్దగా ఆదరణ ఉండదు.అయినా కూడా సమంతతో భారీగా ఖర్చు చేసి ఆహా వారు ఏర్పాటు చేశారు.కాని ఇప్పటి వరకు పెద్దగా ఆధరణ వస్తున్న దాఖలాలు అయితే కనిపించడం లేదు.
అందుకే సమంత టాక్ షో ను చాలా భారీగా ప్లాన్ చేశారు.ఇలా అయినా షోకు వ్యూస్ వస్తాయని అనుకున్నారు.
కాని అనూహ్యంగా విజయ్ దేవరకొండ ఇలా వచ్చి అలా వెళ్లడంతో పాటు సొల్లు ఎక్కవ అయ్యింది.మద్యలో ఏదో ఏదో చేశారు.
నందిని రెడ్డి ఈ టాక్ షోను ఏదో చేయాలనుకుని ఏదో చేసింది అంటూ టాక్ వినిపిస్తుంది.