టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంత మంది హీరోలు ఉన్నప్పటికీ అటు నందమూరి బాలకృష్ణ సినిమాలు అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్.ఎందుకంటే బాలకృష్ణ నటించిన అన్ని సినిమాలు కూడా అసలు సిసలైన మాస్ యాక్షన్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉంటాయి.
ఇక బాలకృష్ణ నటించిన సినిమాలు మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ఇక సినిమాల్లో బాలకృష్ణ డైలాగులు అయితే గూస్ బమ్స్ తెప్పిస్తూ ఉంటాయ్.
ఇలా ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలకృష్ణ ఇటీవలే తనలోని కొత్త కోణాన్ని బయటపెట్టాడు.ఏకంగా ఆహా ఓటిటి వేదికగా హోస్టుగా అవతారం ఎత్తారు నందమూరి బాలకృష్ణ.
మిగిలిన హీరోలకు తాను ఎక్కడ తక్కువ కాదు అని ఈ కార్యక్రమంతో నిరూపించారు.ప్రస్తుతం ఆహా ఓటిటి వేదికగా అన్ స్టాపబుల్ అనే కార్యక్రమంతో హోస్ట్ గా మారిపోయి.
అభిమానులందరినీ అలరిస్తున్నారు.ఒకరకంగా ఆహా ఓటీటీ సబ్ స్క్రైబర్లు ఒక్కసారిగా పెరిగి పోవడానికి అటు బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం కారణం అని చెప్పాలి.
ఈ కార్యక్రమంలో తన తన వాక్చాతుర్యంతో ప్రేక్షకులందరినీ అలరిస్తున్నారు బాలకృష్ణ.ప్రతివారం ఒక స్పెషల్ గెస్ట్ ని పిలుస్తూ ఆసక్తికర ప్రశ్నలు అడుగుతూ ఇక ఈ షోపై మరింత అంచనాలు పెంచేస్తున్నారు బాలకృష్ణ.
అన్ స్టాపబుల్ సూపర్ సక్సెస్ అయింది అని చెప్పాలి.
అయితే బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం సక్సెస్ కావడం వెనక ఆయన రెండవ కుమార్తె తేజస్విని ఉన్నట్లు తెలుస్తోంది.ఈమె క్రియేటివ్ కన్సల్టెంట్గా పనిచేశారు.ఈమె ఇచ్చిన సలహాతో అన్ స్టాపబుల్ లో హోస్ట్ గా బాలయ్య సక్సెస్ సాధించాడు అంటూ టాక్ వినిపిస్తోంది.
అన్ స్టాపబుల్ ప్రతి ఎపిసోడ్ కూడా భారీగా వ్యూస్ సొంతం చేసుకుంటుంది.
ఇక ఒక్కో ఎపిసోడ్ 25 లక్షలు చొప్పున పారితోషికం తీసుకున్నాడట బాలకృష్ణ.ఇటీవలే మహేష్ బాబు ఎపిసోడ్తో మొదటి సీజన్ ముగియబోతుంది అన్న విషయం తెలిసిందే.మొదటి సీజన్ హిట్ కావడంతో రెండో సీజన్ కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంది.
ఏదేమైనా మాస్ హీరో బాలకృష్ణ హోస్ట్ గా కూడా అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్నారు.