ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న త్రివేంద్ర సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.కొన్ని రాజకీయ పరిణామాల మధ్య నిన్న త్రివేంద్ర సింగ్ రావత్ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ బేబీ రాణి మౌర్యకు సమర్పించారు.
కాగా గత కొంత కాలంగా త్రివేంద్ర సింగ్ రావత్పై అవినీతి ఆరోపణలు వస్తున్న క్రమంలో నాయకత్వ మార్పుపై కొన్నాళ్లుగా ఊహాగానాలు సాగుతున్నాయి.ఈ నేపధ్యంలో బీజేపీ అధిష్టానం నిర్ణయం మేరకు త్రివేంద్ర సింగ్ రావత్ తన పదవిని వదిలారని ప్రచారం.
ఇకపోతే రావత్ రాజీనామా తర్వాత కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్న చాలామందిలో తలెత్తింది.ఇందులో భాగంగా కొందరి పేర్లు తెరపైకి రాగా ఎవ్వరూ ఊహించిన రీతిలో బీజేపీ అధిష్టానం కొత్త సీఎంను ఎంచుకుంది.
ఈ క్రమంలో బీజేపీ ఎంపీ, పార్టీ జాతీయ కార్యదర్శి తీరథ్ సింగ్ రావత్ను రాష్ట్ర సీఎంగా నియమించింది.కాగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తీరథ్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారట.