రష్మిక మందనా పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు.ఎంతో మంది ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు.
కాని రష్మిక మాత్రం కొంచెం డిఫరెంట్ అని చెప్పవచ్చు.ఛలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తాను పట్టిందే బంగారం అన్నట్టుగా తెలుగులో చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ కావడంతో ఇక రష్మిక వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు.
ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.రష్మిక కెరీర్ మొదట్లో తన కెరీర్ లో మొదటి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా గీతాగోవిందం.
విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనం చూశాం.
అయితే ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందనా నటించింది.
కాని రష్మిక కంటే ముందు వేరే హీరోయిన్ ను అనుకున్నారట.ఆ హీరోయిన్ ఎవరంటే లావణ్య త్రిపాఠి.
అయితే అలీతో సరదాగా షోకి అతిథిగా వచ్చిన లావణ్య ఈ విషయాన్ని తనే స్వయంగా తానే చెప్పుకొచ్చింది.గీత గోవిందం సినిమాలో హీరోయిన్ గా మొదట నన్ను సంప్రదించారని, కాని నాకున్న కమిట్ మెంట్స్ వల్ల చేయలేకపోయానని లావణ్య తెలిపింది.
ఒకవేళ ఆ సినిమా చేసి ఉంటే నా లైఫ్ ఒక్కసారిగా మారిపోయి ఉండేదని లావణ్య తెలిపింది.