దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు బి.
ఎ.అనగానే చాలా మంది బొడ్డు మీద యాపిల్ వేసే దర్శకుడు, ఫుల్ కమర్షియల్ సినిమా డైరెక్టర్ అని అనుకుంటుంటారు.కానీ ఆయన సీరియస్ సినిమా చేయగలడు, భక్తిరస సినిమా చేయగలడు. ‘బాబు’ అనే చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ కెరీర్ స్టార్ట్ చేసిన కె.రాఘవేంద్రరావు ప్రస్తుతం ‘పెళ్లి సందడి’ అనే సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తూ అందులో నటుడిగా కూడా నటిస్తున్నారు.ఈ సంగతులు పక్కనబెడితే రాఘవేంద్రరావు కెరీర్లోనే గొప్ప సినిమా అయిన ‘జ్యోతి’కి సహజ నటి జయసుధను ఎలా సెలక్ట్ చేశారంటే.
రాఘవేంద్రరావు ‘జ్యోతి’ అనే చిన్న సినిమా తీయాలని నిర్ణయించుకుని, ప్రొడ్యూసర్స్ను ఒప్పించాడు.ఈ క్రమంలోనే హీరోగా మురళీ మోహన్ను సెలక్ట్ చేశాడు.అయితే, హీరోయిన్ మాత్రం ఇంకా ఎవరు అనేది ఫైనల్ కాలేదు.కేరళ, మద్రాసుతో పాటు పలు ప్రాంతాల నుంచి అమ్మాయిలు వస్తున్నారు, వెళ్తున్నారు.
కానీ ఎవరు కూడా రాఘవేంద్రరావుకు నచ్చడం లేదు.ఈ నేపథ్యంలోనే ప్రొడ్యూసర్స్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సినిమా ఎక్కడ ఆగిపోతుందోననే టెన్షన్ మురళీ మోహన్లో మొదలైంది.ఈ క్రమంలో తాను ‘లక్ష్మణ రేఖ’ అనే చిత్రంలో నటిస్తున్నానని, అందులో నటిస్తున్న జయసుధని హీరోయిన్గా తీసుకుంటే బాగుంటుందని డైరెక్టర్ రాఘవేంద్రరావుకు మురళీ మోహన్ చెప్పాడు.
ఎవరు ఆ అమ్మాయి బాగుంటుందా.బాగా నటించగలదా అని పలు ప్రశ్నలు అడిగాడు డైరెక్టర్.బాగా నటిస్తోంది అని మురళీ మెహన్ చెప్పాడు.దాంతో సదరు అమ్మాయి ఆల్బమ్ తెప్పించు చూద్దాం అని రాఘవేంద్రరావు అన్నాడు.మురళీ మెహన్ ఆ రోజు సాయంత్రమే జయసుధ ఆల్బమ్ తెప్పించి చూపించాడు.ఆల్బమ్ చూసి హీరోయిన్గా జయసుధను డైరెక్టర్ ఓకే చేశాడు.
అలా ‘జ్యోతి’ సినిమాకు హీరోయిన్ ఫైనల్ చేయడంలో హీరో మురళీ మోహన్ కీలక పాత్ర పోషించాడు.జయసుధ ఆఫీసుకు వచ్చి డైరెక్టర్తో మాట్లాడి హీరోయిన్గా సెలక్ట్ అయి ఆ చిత్రంలో నటించింది.
ఈ మూవీ జయసుధ కెరీర్కు బాగా ప్లస్ అయిందని చెప్పొచ్చు.దర్శకేంద్రుడు కమర్షియల్గా ఎన్ని సక్సెస్ లు సాధించినప్పటికీ వాటన్నిటికీ పునాది ‘జ్యోతి’ చిత్రంతోనే పడిందని చెప్పొచ్చు.