బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుస్రత్ జహాన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.ఇప్పుడున్న ఎంపీల్లో ఈమె చాలా ఫేమస్.
గెలిచింది ఒక్కసారే అయినా కూడా నటిగా ఆమెకు మంచి గుర్తింపు కూడా ఉంది.అయితే ఆమెకు ఇప్పుడు ఓ అనూహ్యమైన ప్రశ్న తగిలింది.
ఇక ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుని చాలా రోజులుగా విడిగానే ఉంటున్నారు.దీంతో ఆమె ఇటీవల తరచూ వార్తల్లో కనిపిస్తున్నారు.
తన భర్త నిఖిల్ జైన్ నుంచి నుస్రత్ జహాన్ విడాకులు తీసుకున్నప్పటి నుంచి ఆమె జీవితం ఊహించని మలుపులు తిరుగుతోంది.
ఇక పెండ్లికి ముందే ఆమె తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
ఇక భర్తతో విడాకుల తర్వాత ఆమె బెంగాలీ నటుడు అయిన యశ్వంత్ దాస్ గుప్తాతో సన్నిహితంగా ఉంటున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి.ఇక ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా ఆమె గత నెలలో ఒక మగ బిడ్డను కూడా కన్నది.
ఇక ఆమె రీసెంట్ గా ఒక సెలూన్ షాప్ ప్రారంభోత్సవంలో పాల్గొంది.అయితే ఈ ప్రోగ్రామ్ లో ఆమెను ఓ రిపోర్టర్ ఊహించని రీతిలో క్వశ్చన్ అడిగారు.
అదేంటంటే ఇప్పుడు పుట్టిన బిడ్డకు అసలు తండ్రి ఎవరు అని అడిగారు.
అయితే ఈ ప్రశ్నతో తీవ్ర అసహనానికి గురైన ఎంపీ నుస్రత్ జహాన్ చాలా ఘాటుగా ఆ రిపోర్టర్ ప్రశ్నపై రియాక్టు అయ్యారు.ప్రస్తుతం తనకు పుట్టిన బిడ్డ తండ్రి ఎవరో ఆ బిడ్డను కన్న తండ్రికి తెలుసని చెప్పడం సంచలనం రేపుతోంది.అయితే ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్న ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో కూడా చెక్కర్లు కొడుతోంది.
ఎందుకంటే అసలు ఆ బిడ్డ ఎవరికి చెందినవాడో నుస్రత్ జహాన్ కూడా ఎప్పుడూ వివరించే ప్రయత్నం చేయలేదు.ఇక ఇలాంటి ఇబ్బందులు మరిన్ని వచ్చే అవకాశం కూడా ఉందనే చెప్పాలి.
మరి ఆమె ఇలాంటి పరిస్థితుల్ని ఎలా ఎదుర్కుంటారో చూడాలి.