క్రికెట్ అనేది చాలా పాపులర్ అయిన అట.చాలా వరకు దేశాల్లో క్రికెట్ ఆడతారు.
అయితే కాని అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ధనిక బోర్డులు ఉండవు, కొంత మంది క్రీడాకారులు ఆర్థికంగా పటిష్టంగా ఉండరు.ఇది వినడానికి కొంత ఆశ్చర్యం కలిగించినా మనం అంగీకరించక తప్పదు.
ఎందుకంటే క్రికెట్ అనేది ఎక్కువగా పాపులర్ గా ఉన్న దేశం భారత దేశం అని అందరికి తెలిసిందే.అన్ని దేశాల్లో క్రికెట్ అంటే ఒక ఆట మాత్రమే.
కాని మన దేశంలో క్రికెట్ అంటే ఒక మతంలా క్రికెటర్ లను దేవుళ్ళలా పూజిస్తారు.అంతలా భారతదేశంలో క్రికెట్ ను అభిమానిస్తారు.
చిన్న నాటి నుండే క్రికెట్ అనేది ఒక సరదా ఆటలా క్రికెట్ ను ప్రతి ఒక్కరు భావిస్తారు.అందుకే క్రికెట్ అనేది భారతదేశంలో మంచి ఆదరణ గల క్రీడగా ఎదిగింది.
అయితే క్రికెట్ ను సీరియస్ గా కెరియర్ గా మలుచుకుందాం అనుకున్న వారికి అంతర్జాతీయ స్థాయి టీం కు ఆడాలని ఉంటుంది.కాని అంతా ఆశామాషీ వ్యవహారం కాదు.
ఆర్థికంగా ఎంతో కొంత పటిష్టంగా ఉన్నప్పుడే అది సాధ్యపడుతుంది.అయితే కొంత మంది నిరుపేద క్రికెటర్లు కూడా ఉంటారు.
కనీసం సహాయం కోసం ఎదురుచూస్తున్న క్రికెటర్ లు కూడా ఉంటారు.తాజాగా జింబాబ్వే క్రికెటర్ చేసిన పోస్ట్ ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచాన్ని కదిలించింది.
మ్యాచ్ ఆడిన తరువాత మ్యాచ్ లను విరిగిపోయిన షూలను గ్లూతో అతికించుకొని ఆడుతున్నామని, ఎవరైనా స్పాన్సర్ ఉంటే మాకు షూలను అందించండి అని జింబాబ్వే క్రికెటర్ ర్యాన్ బర్ల్ ఆవేదన వ్యక్తం చేశాడు.ఇక ఈ పోస్ట్ కు స్పందించిన పూమా ఇతనితో ఒప్పందం చేసుకోవడమే కాక, టీం మొత్తానికి షూలను స్పాన్సర్ గా అందించింది.