టాలీవుడ్లో ఒక నిర్మాత బ్రోకర్లా మారినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.టాలీవుడ్లో ఈయన పలు సినిమాలను నిర్మించాడట.
ఆ నిర్మాత తాజాగా నయనతార వద్దకు మద్యవర్తిగా వెళ్లడం జరిగింది.వివరాల్లోకి వెళ్తే… గతంలో ప్రభుదేవ, నయనతారలు ఎంత క్లోజ్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు.అయితే ఏం జరిగిందో ఏమో కాని వీరిద్దరి ప్రేమకు అవాంతరాలు ఎదురయ్యాయి.
వీరిద్దరు పెళ్లికి ముందే విడిపోయారు.
గత కొంత కాలంగా వీరిద్దరి మద్య మాటలే లేవు.
అయితే ప్రభుదేవా ఈమెతో మళ్లీ సానిహిత్యం కోరుకుంటున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.అందుకోసం తెలుగులో తనకు సన్నిహితుడు అయిన ఒక నిర్మాతను నయన్ వద్దకు రాయబారం పంపడం జరిగింది.
రాయబారిగా వెళ్లిన ఆ నిర్మాతను నయన్ కొట్టేంత పని చేసిందట.చెడా మడా తిట్టి ఆ నిర్మాతను వెనక్కు పంపిందట.
ఇకపై ఇలాంటి రాయబారాలు తీసుకు వస్తే మరింత సీరియస్గా ఉంటుందని, ప్రభుదేవా ముచ్చట మళ్లీ తన ముందు వినిపించవద్దంటూ ఆ నిర్మాతను నయన్ హెచ్చరించినట్లుగా తెలుస్తోంది.ఇప్పుడు ఆ తెలుగు నిర్మాత ఎవరు అంటూ చర్చ జరుగుతోంది.