బాలకృష్ణ, క్రిష్ల కాంబినేషన్లో వచ్చిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మీద కంటే వర్మ చూపించబోయే అసలు కథమీదే అభిమానులు ఆసక్తికనబరుస్తున్నారు.ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాను వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అయితే ఈ గ్యాప్లోనే వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం కూడా రాబోతుంది.
మొదట వర్మ తీసిన ఎన్టీఆర్ సినిమా తర్వాత, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ మహానాయకుడు రాబోతుంది.ఈ రెండు సినిమాలు కూడా సేమ్ స్టోరీతో రాబోతున్నాయి.ఎన్టీఆర్ రాజకీయ జీవితం గురించి దర్శకుడు క్రిష్ చూపించబోతున్నాడు.
వర్మ కూడా ఎన్టీఆర్ రాజకీయ జీవితంలోని ఒడిదొడుకులు మరియు లక్ష్మీ పార్వతి ఎంట్రీని చూపించబోతున్నాడు.ఇటీవలే రిలీజ్ అయిన లక్ష్మీస్ ఎన్ఠీఆర్ ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభించింది.
ఆ ఊహలకు అడ్డు తెరవేస్తూ వర్మ ఆ పాత్ర పోషించింది ఎవరన్న విషయాన్ని స్పష్టం చేశారు.ఆ వ్యక్తి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రంగస్థల నటుడని చెప్పారు.ఎన్టీఆర్ లా ప్రసంగించడం, హావభావాలు పలికించడం వంటి విషయాల్లో ఆయనకు శిక్షణ ఇచ్చిన విషయాన్ని తన ట్వీట్ లో పేర్కొన్నారు.
.