టాలీవుడ్ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల గ్యాప్ తర్వాత ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం పవన్ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందనున్న ‘అయ్యప్పన్ కోషియుమ్’ రీమేక్ లో నటిస్తున్నాడు.
అంతేకాకుండా మరో సినిమా వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే పవన్ టార్గెట్ మాత్రం వారిపైనేనని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మరో డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ‘హరిహర వీరమల్లు’.ఈ సినిమాలో నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమాకు హరిహర వీరమల్లు అనే టైటిల్ ను ఫిక్స్ చేయగా.ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కనుంది.ఈ సినిమా 17వ శతాబ్దం నాటి కాలం నేపథ్యంలో రానుంది.ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ తో పాటు టీజర్ శివరాత్రి సందర్భంగా విడుదల చేయగా బాగా ఆకట్టుకుంది.
అభిమానుల నుంచి మంచి ప్రశంసలు కూడా వచ్చాయి.
ఫస్ట్ లుక్ తోనే ఈ సినిమా గొప్ప రికార్డు సొంతం చేసుకోగా ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఏ ఒక పాన్ ఇండియా సినిమాల్లో కూడా చేయలేకున్నా.
ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల కంటే ఎక్కువ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నారు.అంతేకాకుండా ఈ సినిమాను తెలుగుతోపాటు మలయాళం, తమిళం, హిందీ భాషలలో విడుదల కానుంది.
ప్రస్తుతం ఈ సినిమా సౌత్ అండ్ నార్త్ సినీ ఇండస్ట్రీలో రికార్డు బద్దలయ్యేలా ఖర్చు చేస్తున్నారట.ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ పాన్ ఇండియా సినిమాలు అని అభిమానులు ఫిక్స్ అవ్వగా మరికొందరు టాలీవుడ్ లో ప్రభాస్ మార్కెట్ ను, బాలీవుడ్ లో స్టార్ మార్కెట్ లను పవన్ గట్టిగానే టార్గెట్ చేసినట్లు అనుకుంటున్నారు.
కానీ పవన్ మాత్రం ఎవరిని టార్గెట్ చేయడని తన ఇమేజ్ ను తానే సెట్ చేసుకుంటాడని తెలిసిందే.