తెలంగాణాలో రీసెంట్ గా జరిగిన రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో టీ.ఆర్.
ఎస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు మేయర్, చైర్మన్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
ఈ నెల 7న ఈ ఎన్నిక జరుగనుందని తెలుస్తుంది.ఖమ్మం మేయర్ పదవికి పునుకొల్లు నీరజ పేరు ఖారారైనట్టు తెలుస్తుంది.
ఈసారి మేయర్ మహిళా జనరల్ కోటా కిందకు రాగా ఖమ్మం మేయర్ గా 26వ డివిజన్ లో గెలిచిన పునుకొల్లు నీరజ వైపు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది.పునుకొల్లు నీరజకు మంత్రి పువ్వాడ సపోర్ట్ ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఖమ్మం మేయర్ గా పునుకొల్లు నీరజ ఎంపిక జరిగినట్టు సమాచారం.
ఇక వరంగల్ మేయర్ గా రాజ్య మాజీ సభ్యురాలు గుండు సుధారాణి పేరుని ఫైనల్ చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సిఎం కే.సి.ఆర్ వరంగల్ మేయర్ గా సుధారాణికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.ఇక జరిగిన ఐదు మున్సిపాలిటీలలో మూడు మున్సిపాలిటీల్లో మహిళలకే చైర్మన్ పదవులు దక్కనున్నాయని తెలుస్తుంది.
ఆల్రెడీ వారి పేర్లు కూడా ఫైనల్ కాగా రేపే వారి ఎన్నిక జరుగుతుందని తెలుస్తుంది.