బుల్లి తెర అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన బిగ్ బాస్ రియాల్టీ షో ఆదివారం నాడు మొదలైంది.ప్రస్తుతం జనాలను బాగా ఎంటర్ టైన్ చేస్తుంది.
మొత్తం 19 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లో నానా రచ్చ చేస్తున్నారు.షో ప్రారంభం అయిన మరుసటి రోజునే ఎలిమినేషన్ ప్రక్రియ మొదలయ్యింది.
అప్పటి నుంచే ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ మాటలు, పొట్లాటలు, అరుపులతో బిగ్ బాస్ హౌస్ చేపల మార్కెట్ లా మారిపోయింది.నామినేషన్ టైంలోనే జెస్సీ-హమీదా ఎమోషనల్ గా ఫీలయ్యారు.
సన్నీ-షణ్ముఖ్, జెస్సీ-విశ్వ, నటరాజ్-రవి ఒకరిపై మరొకరు మాటల తూటాలు విసుకుకున్నారు.
ఏది ఏమైనా తొలివారంలో రవి, మానస్,కాజల్, సరయు, జశ్వంత్, హమీద నామినేషన్ కు నామినేట్ అయ్యారు.
వీరిలో ఒకరు తొలి వారంలోనే బిగ్ బాస్ హౌస్ ను వదిలి వెళ్లనున్నారు.అయితే షో మొదలయ్యాక పరిశీలనగా గమనిస్తే కొన్ని విషయాలు చక్కగా అర్థం అవుతాయి.
తొలివారంలో ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారో ఈజీగా చెప్పవచ్చు.సోషల్ మీడియాలో కూడా ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఇతడే అంటూ జోరుగా చర్చలు నడుస్తున్నాయి.
అయితే ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు.హౌస్ లో అందరితో గొడవలు పడుతున్న జెస్సీ.
జెస్సీ 2018లో సూపర్ మోడల్ ఇండియా టైటిల్ దక్కించుకున్నాడు.బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన ఈ మోడల్.చాలా మంది కంటెస్టెంట్లతో దురుసుగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు.చిన్నాపెద్ద అనే తేడా లేకుండా తన ప్రవర్తన, మాటలో ఇతరులను ఇబ్బంది పెడుతున్నాడు.ఇతడి మూలంగానే హౌస్ లో గొడవలు పెరుగుతున్నాయి.
అనీ మాస్టర్ తో పాటు పలువురి పట్ల ఆయన దురుసు ప్రవర్తన ప్రేక్షకులకు అంతగా నచ్చట్లేదు.అందుకే అతడు ఈ వారం బయటకు వెళ్లే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.అటు మళ్లీ ఇతడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తాడని కూడా చర్చలు జరుగుతున్నాయి.
ఈయన బయటకు వెళ్లగానే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన ఓ కమెడియన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడతాడనే టాక్ వినిపిస్తుంది.