ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు రాజకీయ విశ్లేషకులని సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి.ఏ సమయంలో ఏ పార్టీ ఎటువంటి కీలక నిర్ణయం తీసుకుంటుందో తెలియదు.
అంతేకాదు ఏపీలో రాజకీయ పార్టీలు ఎవరు ఎవరితో జతకడుతారో కూడా ప్రస్తుతానికి అంచనాకి కూడా అందటం లేదు.వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాలలోకి దిగుతానని ప్రకటించిన జనసేన పార్టీ పరిస్థితి అయితే రోజుకో మలుపు తిరుగుతోంది.
తాజాగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలని బట్టి చూస్తుంటే బీజేపి గుప్పెట్లోకి జనసేన వెళ్ళిపోయింది అనే అనుమానాలు కలుగుతున్నాయి అటున్నారు విశ్లేషకులు.వివరాలలోకి వెళ్తే…
బీజేపి తన చేతికి మట్టి అంటుకోకుండా చాలా తెలివిగా ఏపీలో టీడీపి ని దెబ్బకొట్టాలని వ్యూహాలు రచిస్తోంది అందులో భాగంగానే బీజేపీ తెరవెనుక శక్తులు వేసిన అత్యంత పెద్ద ప్లాన్ జనసేనను తమ చేతుల్లోకి తీసుకోవడం.ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కి పార్టీపై పట్టు లేకుండా చేసి పూర్తిగా నిస్సహాయమైపోయిన స్థితిలో దేవ్ అనే కొత్త వ్యక్తిని రంగంలోకి తీసుకువచ్చింది అంటున్నారు…అయితే తాజాగా పవన్ తన ఏసీఎఫ్ అనే సంస్థలో ఉన్న 1200 మంది కార్యకర్తల సాయంతో.జనసేన వ్యవహారాలను దేవ్ చూస్తారని చెప్పుకొచ్చారు…అసలు
ఎవరీ “దేవ్”.? ఏసీఎఫ్ అనే సంస్థలో ఉన్న పన్నెండు వందల మంది ఎవరు.? అసలు ఏసీఎఫ్ ఏర్పాటు సమయంలో కానీ ఈ మధ్య కాలంలో కానీ ఈ దేవ్ పేరు ఎక్కడా వినిపించలేదు.ఈ విషయంపైనే సర్వత్రా చర్చనీయాసం అయ్యింది.
అంతేకాదు దేవ్ ఈ సమయంలో రంగం లోకి దిగడం వెనుకాల బీజేపి భారీ ప్లాన్ వేసిందనే టాక్ కూడా వినిపిస్తోంది…పవన్ కల్యాణ్ను డమ్మీగా చేసి.ఇక దేవ్.
జనసేన వ్యవహారాలను నడపనున్నారు.కేవలం పవన్ కల్యాణ్ తెర ముందు కనిపిస్తారు.
దేవ్ చెప్పినట్లు చేస్తారు…అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.అంతేకాదు జనసేనని ఉపయోగించుకుని ఏపీలో రాజకీయంగా కలకలం సృష్టించడానికి అల్లర్లు రేపడానికి పధకం పన్నుతున్నట్టుగా కూడా వ్యూహాలు సిద్దం అవుతున్నాయి అటున్నారు.
అయితే నేను ఎవరికీ భయపడేది లేదు చావుకి సైతం ఎదురు నిలుస్తా అని చెప్పే పవన్ కళ్యాణ్ ని బీజేపి ఎటువంటి విషయంలో గుప్పెట్లో పెట్టుకుందో తెలియదు కానీ మొత్తానికి పవన్ కళ్యాణ్ ని పావుగా వాడుకోవడానికి బీజేపి మాత్రం పక్కా ప్లాన్ వేసిందని అంటున్నారు.త్వరలో జిల్లాల యాత్ర అంటూ ప్రారంభించబోతున్న పవన్ టూర్ వెనుక కూడా రామ్మాధవ్ మాస్టర్ ప్లాన్ ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది…మరి ముందు ముందు జనసేనని బీజేపి ఏ దారిలో నడిపించడానికి సిద్దంగా ఉందొ త్వరలో తేలనుంది అంటున్నారు టీడీపి నేతలు.