తెలుగు స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఎందుకంటే తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరో గా నిలిచాడు.
ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలలో అవకాశాలు అందుకుని ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాడు.ఇక ఈయనకున్న అభిమానులు అంతా ఇంతా కాదు.
బాలయ్య సినిమా వస్తుందంటే చాలు తెగ ఎదురుచూస్తూ ఉంటారు.ఇదిలా ఉంటే ఈయన సినిమాలో ఒకే ఒక్క డైలాగ్ మాత్రమే ఓ నటుడికి అవకాశం వచ్చిందట.
మామూలుగా బాలకృష్ణ సినిమాలో నటించడానికి ఎంతోమంది నటులు బాగా ఆసక్తి చూపుతుంటారు.పైగా బాలకృష్ణ ఎదురుగా నిల్చొని డైలాగ్ చెప్పాలని కూడా అనుకుంటుంటారు.అలాంటిది ఓ నటుడికి బాలయ్య సినిమాలో అవకాశం రాగా అది కూడా ఒకే ఒక్క డైలాగ్ తో తన పాత్ర ముగిసింది.ఇంతకీ ఆ నటుడు ఎవరో కాదు విలన్ గా ఎన్నో సినిమాలలో నటించిన అజయ్.
ఈయనకు చదువుకునే రోజుల్లో బాలయ్య నటించిన ‘వంశోద్ధారకుడు‘ లో నటించే అవకాశం వచ్చింది.
ఇక దాంతో అజయ్ సంతోషంలో మునిగిపోయాడు.పైగా తన మొదటి సినిమా బాలకృష్ణ సినిమాలో అవకాశం వచ్చేసరికి ఎంతోమంది తనను అదృష్టవంతుడువని పొగిడారట.అలా సినిమా షూటింగ్ కు వెళ్లగానే డైలాగ్ పేపర్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేసి సింగిల్ టేక్ లోనే చెప్పాలని అనుకోని సిద్ధమయ్యాడట.
పైగా బాలకృష్ణ కు గట్టి పోటీగా ఉండాలని అనుకున్నాడట.అలా తనకు సినిమా సెట్ నుండి పిలుపు రావడంతో అక్కడ తనకు ఉండేది సింగిల్ డైలాగ్ ఉందని తెలిసే సరికి షాక్ అయ్యాడట.
ఏంటో మరి? అని ఒక చిన్న మాట మాత్రమే.ఇక ఆ డైలాగ్ చెప్పినప్పుడు తనకు డైరెక్టర్ యాక్షన్, కట్ అని ఎప్పుడు చెప్పారో కూడా అర్థం కాలేదట.ఇక తర్వాత తన ఇంటికి వచ్చాక తన తల్లి కూడా ఎలా చేశావు .ఎన్ని డైలాగులు ఉన్నాయని అనడంతో.ఏడ్చినట్టే ఉంది ఇదేం డైలాగ్ రా’ అని వాళ్ళ అమ్మ కూడా నవ్విందట.ఇక ఆ తర్వాత ఖుషి సినిమాలో నటించడంతో తనకు వరుస సినిమాలలో అవకాశాలు వచ్చాయట.