యాంకర్ రష్మీ.ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.బుల్లితెరపై స్టార్ యాంకర్ అని గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం జబర్దస్త్, ఢీ షోస్ చేస్తూ తనకంటూ ఓ మార్క్ సృష్టించింది.అలా బుల్లితెరపై మెరుస్తున్న ఈ యాంకర్ జంతు ప్రేమికురాలు. సోషల్ మీడియాలో ఏదైనా జంతువుకు దెబ్బ తగిలింది అని కానీ ఎవరైనా హింసిస్తున్నారు అని తెలిసిన యాంకర్ రష్మీ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పుకొస్తుంది.
ఏదైనా వీధి కుక్కకు దెబ్బ తగిలింది అంటే దానికి వైద్యం చేయించకుండా ఉండలేరు.
ఏ జంతువుకు హాని చెయ్యకూడదని.జంతువులను ప్రేమించాలంటూ చెప్తుంటారు యాంకర్ రష్మీ.
కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలోను వీధిలో తిరిగే జంతువులకు ఆహారం పెట్టాలని, వీధి కుక్కలకు ఆహారం పెట్టండి అంటూ ట్విట్టర్ ద్వారా కోరారు కూడా.ఇక ఈ నేపథ్యంలోనే యాంకర్ రష్మీ ఇప్పుడు మరోసారి ట్విట్టర్ వేధికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక ఆవు దగ్గర ఉన్న లేగ దూడ తల్లిపాలు తాగకుండా దాని మూతికి బుట్ట కట్టడంపై రష్మీ స్పందించారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.హైదరాబాద్లోని లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్న గోశాలలో ఒక ఆవు, లేగదూడను కట్టి ఉంచారు.అయితే, ఆ లేగదూడ తల్లిపాలు తాగకుండా మూతికి బుట్ట కట్టారు.
ఇక ఇది చూసిన ఓ జంతు ప్రేమికుడు వీడియో తీసి ”అత్యంత క్రూరత్వం” అంటూ ట్విట్టర్లో షేర్ చేశారు.ఇక దానికి స్పందించిన రష్మీ.”తల్లిపాలు తాగడానికి ఎవరు ఎక్కువ అర్హులు??? మనమా లేకపోతే దూడనా.మీరు ఏది ఎంపిక చేసుకున్నా కచ్చితంగా అది మీ మనస్సాక్షి భారం కాకుండా చూసుకోండి” అంటూ ట్వీట్ చెయ్యగా ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.