సినిమాలలో అవకాశం రావాలి అంటే అంత ఆషామాషీ విషయం కాదు.ఎంతో నేర్పు, నైపుణ్యత, పనితనం, నటన కలిసి ఉన్న మాత్రాన అవకాశాలు రావు.
వాటితో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి.అయితే కొందరికి వారి తల్లిదండ్రుల వారసత్వం నుండి సినిమా లలో నటించడానికి అవకాశాలు కాస్త సులువుగా అవకాశాలు లభిస్తాయి.
మరికొందరికి అదృష్టం కలిసి వచ్చి అనుకోకుండా సినిమాల్లో నటించడానికి అతి తక్కువ వయసులోనే అవకాశాలు వస్తుంటాయి.ఇక అసలు విషయంలోకి వెళితే మన టాలీవుడ్ ఇండస్ట్రీకి అతి తక్కువ వయసులోనే సినిమాల్లో హీరోయిన్ గా నటించిన వారి వివరాలను ఓ సారి చూద్దామా.
ఈ లిస్టులో ముందుగా మనము చెప్పుకోదగ్గ నటి అలనాటి శ్రీదేవి.శ్రీదేవి తన 13 సంవత్సరాల వయసు లోనే ప్రధాన హీరోయిన్ గా ఫిలిం ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది.అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది శ్రీదేవి.ఇలా తక్కువ వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ముఖ్య కథానాయకులుగా ఎదిగి తనదైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు.
ఇందులో ముఖ్యంగా కృతి శెట్టి ,ఛార్మి, తమన్నా, అధిక హన్సిక, శ్వేతా బసు ప్రసాద్, సాయేషా సైగల్ నందిత రాజ్, శర్మ వీరందరూ కూడా 20 సంవత్సరాల లోపు వయస్సు గల వారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వారికంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉప్పెన సినిమాలో నటించిన కృతి శెట్టి 17 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రత్యేక ఆదరణను సొంతం చేసుకుంది.అంతేకాదు ఇప్పటికే పలు సినిమాల్లో నటించేందుకు అవకాశాలు కూడా సొంతం చేసుకుంది.ఇలా చెప్పుకుంటూ పోతే ఛార్మి తర పదహైదు సంవత్సరాల వయసులోనే నీతోడు కావాలి అనే సినిమాలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అలాగే తమన్నా తన 15 సంవత్సరాల వయసులోనే చంద్ర సార్ ఓషన్ అనే సినిమాలో నటించింది.ఈ లిస్టులో దేశముదురు సినిమాలో అల్లు అర్జున్ సరసన హన్సిక కూడా తన 16 వ ఏట ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
అలాగే వరుణ్ సందేశ్ సరసన శ్వేతా బసు ప్రసాద్ కొత్త బంగారులోకం సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టు కుంది .శ్వేతా బసు ప్రసాద్ తన 17 వ ఏట ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.