అఫ్గనిస్తాన్ దేశానికి చెందిన లెగ్ స్పిన్నర్ రషీద్ఖాన్ టీ 2 ఫార్మట్లో తనకు ఇష్టమైన ఐదుగురు క్రికెటర్స్ పేర్లను వెల్లడించాడు.అసలే త్వరలో టీ20 వరల్డ్ కప్ మొదలవబోతోంది.
యూఏఈ, ఒమన్లో నిర్వహించనున్న టోర్నీకి సర్వం సిద్ధమవుతున్నది.ఇందుకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా మారుతుంది.
ఈక్రమంలో రషీద్ ఖాన్ ఆయనకు ఇష్టమైనటువంటి ప్లేయర్స్ పేర్లును వెల్లడించడంతో ఆ విషయం మరింత ఆసక్తిని రేపింది.అతడు వెల్లడించిన లిస్టులో ఇ ఏబీ డివిల్లియర్స్, వెస్టిండీస్ టీంకు చెందిన కీరన్ పొలార్డ్ ఆ లిస్టులో ఉన్నారు.
ఈ క్రమంలో విరాట్ కోహ్లి గురించి రషీద్ ఖాన్ కొన్ని విషయాలు వెల్లడించాడు.ఇండియన్ టీంకు చెందిన కెప్టెన్, ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్ జట్టు కెప్టెన్ విరోట్ కోహ్లి ఏ సమయంలోనైనా ధీటుగా నిలబడి ఉత్తమ ప్రదర్శన కనబరిచే ఆటగాడని అతడు అభిప్రాయపడ్డారు.
టీం ఇండియాకు చెందిన్ ఆల్ రౌండర్ ఆటగాడు హార్దిక్ పాండ్యా.ముంబై ఇండియన్స్ టీంలో సభ్యుడు.ఇతడు పొట్టి ఫార్మట్లో 2,728 రన్స్ చేశాడు.
ఇక న్యూజిలాండ్కు చెందిన కేన్ విలియమ్ సన్ టీ 20 ఫార్మట్లో 5,429 రన్స్ చేశాడు.అతడి గురించి రషీద్ ఖాన్ వివరిస్తూ.విలియం సన్ ప్రశాంతంగా ఉంటాడని, జట్టును సైతం కూల్గా ముందుకు నడిపిస్తాని చెప్పుకొచ్చాడు.
ఇక సౌత్ ఆఫ్రికాకు చెందిన ఏబీ డివిల్లియర్స్ గురించి పేర్కొంటు.ఎలాంటి బౌలర్ ఎదురుగా ఉన్నా విరుచుకుపడటమే ఆయనకు అలవాటని ప్రశంసించాడు.
అలాంటి ఆటగాడు జట్టులో ఉండాలని ప్రతి కెప్టెన్ కోరుకుంటాడంటూ ప్రశంసించాడు.వెస్టిండిస్కు చెందిన కీరన్ పొలార్డ్పై సైతం రషీద్ ప్రశంసలు కురిపించాడు.