కరోనా వైరస్ పుణ్యమా అని చాలా వరకు ఇంటి వద్ద నుండే పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఇదే సమయంలో తీరిక సమయం దొరికినప్పుడు వారి స్నేహితులతో ఆన్లైన్ లో ఆటలు ఆడుకుంటూ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
ఇదే నేపథ్యంలోనే లూడో గేమ్ ఆడిన పాపానికి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.సరదాగా ఇద్దరు స్నేహితులు ఆడిన లూడో గేమ్ చివరికి తన మిత్రుడిని హత్య చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో సంభవించింది.
ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… జిల్లాలోని బోనకల్ లో సోమవారం రాత్రిపూట గోపి, నాగేశ్వరరావు అనే ఇద్దరు మిత్రులు లూడో గేమ్ ఆడటం మొదలుపెట్టారు.
లూడో గేమ్ ఆడటమే కాకుండా ఆ సమయంలో వారు మద్యం తాగుతూ…, ఆటకు సంబంధించి బెట్టింగ్ పెట్టుకున్నారు.ఇలా ఆడుతూ రెండు ఆటలు అడగా రెండింటిలోనూ నాగేశ్వరరావు ఆటను గెలిచాడు.
దీంతో ఒకింత గోపికి అసహనం ఏర్పడింది.అయితే ఇక మూడోసారి పెద్దమొత్తంలో బెట్టింగ్ పెట్టి ఆడదాం అంటూ సవాలు తన గోపి తన స్నేహితుడు నాగేశ్వరరావు కి విసిరాడు.
మద్యం మత్తులో ఉన్న నాగేశ్వరరావు ఆ సమయంలో గోపీని చూసి అవహేళన చేయడం మొదలుపెట్టాడు.దీనితో కోపోద్రిక్తుడైన గోపి మద్యం సీసాలను పగలగొట్టి వెంకటేశ్వరరావు మేడపై, అలాగే కడుపులో పొడిచాడు.ఈ సంఘటనతో వెంకటేశ్వర రావు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.