టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఆ నాలుగా సినిమాలు నాలుగు విభిన్నమైన జోనర్ లో వచ్చాయి.
నాలుగు సినిమాల్లో ఎన్టీఆర్ సినిమాకు పాజిటి టాక్ దక్కిన కూడా కొన్ని కారణాల వల్ల సినిమాకు కలెక్షన్స్ అంతగా రావడం లేదు.
ఇక వినయ విధేయ రామ సినిమా విషయంలో విభిన్నంగా జరిగింది.నెగటివ్ టాక్ వచ్చినా కూడా సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి.పేట సినిమాకు పెద్దగా వసూళ్లు రావడం లేదు.
ఇక ఎఫ్2 సినిమా కుమ్మేస్తోంది.
సంక్రాంతికి ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ సినిమాలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది.అలాగే ఎఫ్ 2 సినిమాకు కూడా భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి.ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మ రధం పడుతున్నారు.
సినిమా కు అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి.ఓవర్సిస్ లో సినిమా సునాయాసంగా మిలియన్ మార్క్ ను దక్కించుకుంది.మరో మినియన్ డాలర్లను కూడా సినిమా రాబట్టడం ఖాయంగా సినీ వర్గాలు వారు అంటున్నారు.
సంక్రాంతికి యాక్షన్, మాస్ సినిమాలకంటే కూడా కామెడీ సినిమాలకే ఆదరణ దక్కింది.కామెడీతో భారీగా వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు భారీగా వసూళ్లు రాబడుతున్నారు.వీరిద్దరూ కూడా తొడల్లుళ్లుగా చేసిన కామెడీకి సంక్రాంతి విజేతలుగా నిలిచారు.2018 సంక్రాంతి కి విజేతగా ఎఫ్ 2 నిలిచింది.