వర్షాకాలం స్టార్ట్ అయింది.మెల్ల మెల్లగా వర్షాలు ఊపందుకుంటున్నాయి.
అయితే ఈ సీజన్లో వర్షాలకు తోడు అనేక అంటువ్యాధులు కూడా ఎక్కువగా ఉంటాయి.అందులోనూ చిన్నపిల్లలు, వృద్దులు, గర్భిణులు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి.
అందుకే ఈ సీజన్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.ముఖ్యంగా ఈ వానాకాలంలో వ్యాపించే వ్యాధుల బారిన పడకుండా ఉండాలీ అంటే ఖచ్చితంగా కొన్ని కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షాకాలంలో ఆయిల్ లేదా ఫ్రైడ్ ఫుడ్స్ జోలికే వెల్లకూడదు.
ఇవి త్వరగా అరగకుండా ఇబ్బంది పెట్టడమే కాదు ఇమ్యూనిటీ సిస్థమ్ను డ్యామేజ్ చేస్తాయి.దాంతో రోగాలు వేగంగా ఎటాక్ చేస్తాయి.
ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.కానీ, ఈ వర్షాకాలంలో ఆకుకూరలకు దూరంగా ఉండటమే మంచిదంటున్నారు నిపుణులు.
ఎందుకంటే, ఈ సీజన్లో దొరికే ఆకుకూరలను ఎంత కడిగినా.వాటిలో ఎంతోకొంత బ్యాక్టీరియా నిండి ఉంటుంది.
ఫలితంగా ఫుడ్ పాయిజన్ కు కారణం అవుతుంది.
అలాగే రోడ్ సైడ్ ఫుడ్ను ఈ సీజన్లో ఎంత ఎవైడ్ చేస్తే మీ ఆరోగ్యం అంత సేఫ్గా ఉంటుంది.కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, పండ్ల రసాలు, లస్సీలు వంటి వాటికి ఈ వర్షాకాలంలో దూరంగా ఉండాల్సిందే.లేదంటే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
సీ ఫుడ్, చింతపండు, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు, డైరీ ప్రొడక్ట్స్, ఊరగాయలు వంటి వాటిని కూడా దూరం పెట్టాలి.
ఇక పైన చెప్పుకున్న ఆహారాలను ఎవైడ్ చేయడమే కాదు డైట్లో పోషకాహరం ఉండేలా చూసుకోవాలి.
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు దోమలు రాకుండా ఏర్పట్లు చూసుకోవాలి.ఎందుకంటే, ఈ సీజన్లో దోమల కారణంగానే ఎక్కువ వ్యాధులు సంక్రమిస్తాయి.
చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి.అల్లం, నిమ్మ, మిరియాలు, పసుపు, వెల్లుల్లి వంటివి డైట్లో ఉండేలా చూసుకోవాలి.