భగవంతుని పూజించే సమయంలో కింద పడిన పువ్వులు, తొడిమ లేని పువ్వులను అసలు ఉపయోగించకూడదు.పరమేశ్వరుని పూజకు జిల్లేడు,మారేడు, గన్నేరు, తుమ్మి, ఉత్తరేణి ఆకులూ, జమ్మి ఆకులూ, జమ్మి పూలు మంచివి.
శ్రీ మహా లక్ష్మి – మారేడు
పార్వతి – నల్ల కలువ
కుమారస్వామి – తెల్ల కలువ
పరమేశ్వరుడు – కమలం
చదువుల సరస్వతి – తెల్ల జిల్లేడు
బ్రహ్మ – కొండ వాగుల్లో
గణపతి – కరవీర పుష్పం
శ్రీ మహా విష్ణువు – సివమల్లి
గౌరీ దేవి – సుగంధ పుష్పాల్లో ఉంటారు.
శ్రీ మహావిష్ణువును అక్షింతలతోనూ, మహా గణపతిని తులసితోను, తమాల వృక్ష పువ్వులతో సరస్వతిదేవిని, తమ్మి పూలతో మహాలక్ష్మిని,మల్లె పువ్వులతో బైరవున్ని, మొగలి పువ్వులతో శివున్ని, మారేడు దళాలతో సూర్య భగవానుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో పుజించకూడదు.