ప్రస్తుతం సాంకేతిక యుగంలో ఎవరికి ఎటువంటి సందేహం ఉన్నా అందరూ వెతికే ఒకే ఒకటి గూగుల్.రోజుకు కొన్ని కోట్ల మంది గూగుల్ ని వినియోగిస్తారు.
వారికి ఉన్న వృత్తి పరమైన సందేహాలు కావచ్చు, వ్యక్తిగత జీవిత సందేహాలు కావచ్చు.ఇలా వారికి వచ్చిన సందేహానికి గూగుల్ లో వారు తమ సందేహాలను నివృత్తి చేసుకుంటారు.
అయితే 2020 సంవత్సరం అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి ఒక బ్యాడ్ ఇయర్ గా మిగిలిపోయిందనే చెప్పవచ్చు.
అయితే ఇంతటి బ్యాడ్ ఇయర్ లో ఎక్కువగా ఎటువంటి అంశాలపై గూగుల్ లో వెతికారో ఓ నివేదిక ద్వారా వెల్లడైంది.2020లో ఎక్కువగా కోవిడ్ అంటే ఏమిటి, ఆస్ట్రేలియా అడవుల దహనం, లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు వారి వారి ప్రాంతాలకు నడిచి వెళ్లిన సందర్భంలో వలస కార్మికుల జీవన విధానంపై ఇలా రకరకాల అంశాలపై వెతికినట్లు నివేదికలో వెల్లడైంది.ప్రతి ఏడాది గూగుల్ టాప్ సెర్చ్ లపై నివేదికను విడుదల చేస్తున్నా ఈ సారి ప్రకటించిన నివేదిక నెటిజన్లను ఆసక్తికి గురి చేసింది.
ఎందుకంటే ఎవరు దేని గురించి వెతికారో తెలుసుకోవాలని ఆసక్తి ఉండడం సహజమే.మరి 2021 గూగుల్ టాప్ సెర్చ్ లు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.