టాలీవుడ్ హాట్ బ్యూటీ రాత్తాలు రాయ్ లక్ష్మి హీరోయిన్ వేర్ ఇజ్ వెంకటలక్ష్మి అనే సినిమా తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ సినిమా పోస్టర్, టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకుంది.
ప్రవీణ్, మధు నందన్ ఈ సినిమాలో ఇందులో కీలక పాత్రలలో నటిస్తున్నారు.ఇక హీరోయిన్ పాత్ర ప్రాధాన్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో రాయ్ లక్ష్మి సోయగాలు చూడటానికి తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.రొమాంటిక్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది అని తెలుస్తుంది.
ఇదిలా వుంటే వేర్ ఈజ్ వెంకటలక్ష్మి సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు రెడీ అవుతున్నారు.రేపు సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేసి తెలియజేసారు.
ఇదిలా వుంటే ఇక రాయ్ లక్ష్మి చాలా గ్యాప్ తర్వాత ఫుల్ లెంత్ రోల్ లో నటిస్తున్న సినిమా ఇదే కావడంతో దీనిపై తెలుగు నాట భారీ అంచనాలు నెలకొని వున్నాయి.ఇదిలా వుంటే రాయ్ లక్ష్మి ఎ స్థాయిలో ప్రేక్షకులని మెప్పిస్తుంది.
సినిమా ఎ జోనర్ లో ఉండబోతుంది అనే విషయం తాజాగా రిలీజ్ కాబోతున్న ట్రైలర్ తో తెలిసే అవకాశం వుంది.