ఇటీవలే జరుగుతున్న సంఘటనలు ఒకదానికంటే మరొకటి అత్యంత దారుణంగా ఉన్నాయి.కొన్ని దారుణాల గురించి వింటే ఎవరైనా భయభ్రాంతులకు గురికావాల్సిందే.
ఒక్క మాటలో చెప్పాలంటే సైకో కిల్లర్లు( Psycho killers ) చేసే దారుణాలు అత్యంత కిరాతకంగా ఉంటున్నాయి.మనిషిలో మానవత్వం అనేది లేకుండా పోతుంది.
మృగాల కంటే క్రూరంగా మనిషి అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు.
ఇలాంటి కోవకు చెందిన ఓ సైకో కిల్లర్ ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని రాళ్లతో కొట్టి చంపి, ఆమె మాంసాన్ని తిన్నాడు.ఈ సంఘటన చూసిన స్థానికులు అతడిని పట్టుకునే ప్రయత్నం చేయగా కిలోమీటర్ల దూరం పరుగులు తీశాడు.చివరికి నిందితున్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
ఈ సైకో కిల్లర్ కథ ఏమిటో చూద్దాం.
వివరాల్లోకెళితే.ముంబై కి చెందిన సురేంద్ర( Surendra ) (24) డ్రగ్స్ కు బానిస అయ్యాడు.మహారాష్ట్రలోని పాలికి 90 కిలోమీటర్ల దూరంలో ఉండే సేంద్ర పోలీస్ స్టేషన్ పరిధిలో శరద్నా గ్రామంలో ఓ 60 ఏళ్ల వృద్ధురాలైనా శాంతి దేవి శుక్రవారం ఉదయం 9 గంటలకు మేకలను మేపేందుకు పొలానికి వెళ్ళింది.
తరువాత పొలం నుంచి కూరగాయలు తీసుకుని ఇంటికి వస్తూ ఉండగా మార్గమధ్యలో సురేంద్ర ఆ వృద్దిరాలిపై దాడి చేసి చంపేశాడు.అంతటితో ఆగకుండా ముఖంపై రాళ్లతో చితకబాదాడు.
ఆమె మరణించింది అని నిర్ధారించుకున్నాక.ఆమె మృతదేహం లోని మాంసం ముద్దలను తినడం ప్రారంభించాడు.
అటువైపుగా వెళ్తున్న స్థానికులు ఈ సంఘటనను గుర్తించి సురేంద్రను పట్టుకునే ప్రయత్నం చేయగా వారి నుండి తప్పించుకోవడం కోసం కొన్ని కిలోమీటర్ల దూరం పరుగులు తీశాడు.చివరికి ఎలాగోలా నిందితున్ని పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం సెంద్ర ఆసుపత్రికి తరలించారు.నిందితున్ని అదుపులోకి తీసుకొని ఇతని వద్ద ఉండే ఆధార్ కార్డు ద్వారా సురేంద్ర గా గుర్తించారు.
ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.