దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ పక్రియ చాలా వేగవంతంగా జరుగుతున్న విషయం తెలిసిందే.మొదటి దశలో ఆరోగ్య కార్యకర్తలకు ఇచ్చిన టీకాలను క్రమ క్రమంగా అన్ని ప్రభుత్వ రంగ ఉద్యోగులకు కూడా ఇస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం మాత్రం ప్రముఖులందరు కూడా ఈ కోవిడ్ టీకాను తీసుకున్నారు.ఇంకా తీసుకుంటున్నారు.ఈ నేపధ్యంలో ఏపీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ రాష్ట్రంలో జర్నలిస్టుల కోసం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.కాగా చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి నేతృత్వంలో ఈ టీకా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ, మెరుగైన సమాజం కోసం కృషి చేస్తున్న జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు ఆరోగ్యంగా ఉంటేనే వాస్తవ సమాచారాన్ని ప్రజలకు అందించ గలుగుతారని వెల్లడించారు.ఇక దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ కరోనా నియమాలను తప్పకుండా పాటించాలని ప్రజలకు సూచించారు.