నేదురుమల్లి రాం కుమార్.నెల్లూరు జిల్లా వాసులకు ఈ పేరు కొత్తకాదు.రాష్ట్రస్థాయిలో నేదురుమల్లి కుటుంబం కూడా తెలిసిందే.ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా నేదురుమల్లి జనార్దన్రెడ్డి చక్రం తిప్పారు.ఇక, ఆయన సతీమణి.రాజ్యలక్ష్మి కూడా మంత్రిగా పనిచేశారు.
కాంగ్రెస్లో మంచి ఫామ్లో ఉన్న కుటుంబం.జనార్దన్రెడ్డి మరణం, రాష్ట్ర విభజనలతో.
తీవ్రంగా దెబ్బతింది.నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో వరుస విజయాలు సాధించిన ఈ కుటుంబం.2009, 2014 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది.
ఇక, ఆ తర్వాత రాష్ట్ర విభజనతో ప్రత్యక్ష రాజకీయాల నుంచి రాజ్యలక్ష్మి తప్పుకొన్నారు.
అయితే.వీరి వారసుడిగా.
రాజకీయాల్లోకి రావాలని అనుకున్న రాం కుమార్.కాంగ్రెస్లోకి వచ్చారు.
అప్పటి రాష్ట్ర పార్టీ చీఫ్.రఘువీరారెడ్డి ఆయనను పార్టీలో చేర్చుకున్నారు.
అయితే.కాంగ్రెస్ ప్రభావం తగ్గిపోవడంతో.
రాం కుమార్ ఆశలు ఆవిరయ్యాయి.పైగా వెంకటగిరిలో టీడీపీ తరపున కురుగొండ్ల రామకృష్ణ చక్రంతిప్పారు.
ఆయన స్థిరపడిపోయి.రెండు సార్లు విజయం సాధించారు.
దీంతో టీడీపీ ముందు కాంగ్రెస్ నిలవలేక పోయింది.ఇక, కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా వైసీపీ వైపు మళ్లింది.
ఈ క్రమంలోనే రాం కుమార్ గత ఏడాది ఎన్నికలకు ముందు.వైసీపీలో చేరేందుకు ప్రయత్నించారు.ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న జగన్ను స్వయంగా వెళ్లి కలుసుకున్నారు.వెంకటగిరి నియోజకవర్గం టికెట్ ఆశించారు.దీనికి ఎలాంటి హామీ లభించిందో తెలియదు కానీ.వెంటనే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు రాం కుమార్.
అనంతర పరిణామాల్లో ఇక్కడ ఆనం రామనారాయణ రెడ్డికి జగన్ టికెట్ ఇచ్చారు.ఎన్నికల్లో ఆనంకు సహకరించాలంటూ.
రాం కుమార్ను కోరినట్టు సమాచారం.అయితే.
ఇక అప్పటి నుంచి రాం కుమార్ ఎక్కడా కనిపించలేదు.
నిజానికి ఇక్కడ ఆయన యాక్టివ్గా ఉండి ఉంటే.
వైసీపీలో ఇప్పుడు కీలకంగా మారి ఉండేవారని అంటున్నారు పరిశీలకులు.ఎందుకంటే.
ఆనంపై జగన్ పెట్టుకున్న ఆశలకు భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్నారు.పార్టీ పరువును రోడ్డుకు లాగుతున్నారు.
అంతర్గత కుమ్ములాటలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.దీంతో జగన్ ఆనంపై విసిగిపోయారని… దీంతో రాంకుమార్కు అవకాశం దక్కి ఉండేదని అంటున్నారు.
కానీ, ఆయన అసలు ఎక్కడా అడ్రస్ లేకుండా పోవడం గమనార్హం.