తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఎక్కడ ఇస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.24 గంటలు కరెంట్ ఇస్తామని కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు.
ఒక్క రైతు బంధు ఇచ్చి మొత్తం సబ్సిడీ వ్యవస్థను నాశనం చేశారని బండి సంజయ్ విమర్శించారు.టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు.
లీకేజీ కేసులో కేటీఆర్ హస్తం ఉన్నందు వల్లనే కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.పేపర్ లీకేజీ విషయంలో ప్రభుత్వాన్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదని తెలిపారు.