స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఇప్పటివరకైతే చాలా నీట అండ్ క్లీన్ ఇమేజ్ ఉంది.అర్జున్ తో పనిచేసిన ఏ హీరోయిన్ తో కూడా తనకి లింక్ అప్స్ పెట్టలేదు మీడియా.
అయితే తొలిసారి బన్ని మీద ఓ పెద్ద రూమరే పుట్టుకొచ్చింది.మరి ఇది నిజంగానే నిజమా, లేక రూమరా అనేది అల్లు అర్జున్ , పూజ హెగ్డేలకే తెలుసు.
వీరిద్దరు జంటగా నటించిన సినిమ్మా డీజే – దువ్వాడ జగన్నాథం.మొదటి మూడురోజులు మెరుపులు మెరిపించిన ఈ చిత్రం ఆ తరువాత డీలాపడింది.
మరి ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో భారి నష్టాలు రానున్నాయి.అందుకే అమెరికా ప్రేక్షకులని కలిసి వారిలో డీజే చూసేందుకు ఆసక్తి పెంచాలని డిజీ టీం అమెరికా ట్రిప్ వేసింది.
మరి ఈ యూఎస్ యాత్ర వలన సినిమాకి ఏమైనా లాభం జరిగిందా అంటే ఏమి లేదు.ఊరికే రానుపోను దారి ఖర్చులు పెట్టుకున్నారు.
అయితే ఈ యాత్రలో అల్లు అర్జున్ – పూజ హెగ్డే బాగా క్లోజ్ అయినట్టు ఫిలింనగర్ లో బలమైన టాక్ విన్పిస్తోంది.ఎంత క్లోజ్ అంటే యూనిట్ లో మిగితావారికి తెలియకుండా ఇద్దరు కలిసి ఓ రాత్రంతా మాయం అయ్యేంతా.
యుఎస్ లో ఉండగా ఓ రోజు రాత్రి కలిసి బయటకి వెళ్ళిన బన్ని – పూజ, తెల్లారితే గాని హోటల్ వైపు రాలేదట.మరి ఇద్దరు ఎటు వెళ్ళారు, ఎక్కడ షికారు చేసారు, ఊరికే అమెరికా అందాలను చూడడానికి వెళ్ళారా, ఇందులో తప్పులు వెతకాల్సిన పని ఉందా లేదా అనేది మాకు కూడా తెలియదు.
టాక్ అయితే ఇలా ఉంది.మరి ఇందులో నిజమెంతో!
మిగితా విషయాలు మాట్లాడుకుంటే, డిజే ఫ్లాప్ తరువాత అల్లు అర్జున్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.
దీన్ని లగడపాటి శ్రీధర్ నిర్మిస్తారు.మరోవైపు పూజ హెగ్డే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో ఓ సినిమా ఒప్పుకుంది.
మహేష్ బాబు – వంశీ పైడిపల్లి సినిమాలో పూజ పేరు పరిశీలనలో ఉండటం విశేషం.