మార్చి నెలలో కరోనా కారణంగా షూటింగ్స్ ను క్యాన్సిల్ చేసుకోవాలంటూ ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చాయి.కొన్నింటికి ఇండోర్ లో షూటింగ్ కు అనుమతులు ఇచ్చారు.
కొన్ని రోజులకే కరోనా ఇండియాలో వేగంగా వ్యాప్తి చెందుతుంది అనే ఆందోళనతో కేంద్రం సంపూర్ణ లాక్ డౌన్ ను ప్రకటించింది.దాంతో అప్పటి వరకు ఒకటి రెండు షూటింగ్స్ జరుగుతున్నా ఆ తర్వాత మొత్తం ఆగిపోయాయి.
దాదాపు రెండు నెలల తర్వాత షూటింగ్స్ కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.తెలుగు రాష్ట్రాలు జూన్ నుండే షూటింగ్స్ కు అనుమతులు ఇచ్చినా కూడా సినిమాలు మాత్రం షూటింగ్ ప్రారంభం అవ్వలేదు.
జులై నుండి షో లు మరియు సీరియల్స్ మాత్రమే చిత్రీకరణ జరిగాయి.ఎట్టకేలకు సెప్టెంబర్ నుండి సినిమాల షూటింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి.గత నెలలో మొదలు పెట్టని వారు ఈ నెలలో షూటింగ్ ను మొదలు పెట్టేందుకు సిద్దం అయ్యారు, సిద్దం అవుతున్నారు.యంగ్ హీరోలు సీనియర్ హీరోలు దాదాపు అందరు కూడా రంగంలోకి దిగేందుకు సిద్దం అయ్యారు.
కొందరు రంగంలోకి దిగారు.కాని సీనియర్ మోస్ట్ స్టార్ హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణలు మాత్రం ఇప్పటి వరకు తమ సినిమాల షూటింగ్ లకు రెడీ అవుతున్న దాఖలాలు కనిపించడం లేదు.చిరంజీవి ఆచార్య సినిమాను మద్యలో వదిలేశాడు.బాలయ్య కూడా బోయపాటి సినిమాను సగం వరకు పూర్తి చేశాడు.వీరిద్దరి కోసం ఆ ఇద్దరు దర్శకులు వెయిట్ చేస్తున్నారు.ప్రస్తుతం షూటింగ్స్ కు వారు రెడీ అవుతున్న ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం వయసు కాస్త ఎక్కువ అవ్వడం వల్ల కరోనాకు భయపడుతున్నట్లుగా తెలుస్తోంది.
కరోనా వల్ల ఏం కాదు అని ఎంతగా అనుకుంటున్నా కూడా వారి కుటుంబ సభ్యులు షూటింగ్ కు ఒప్పుకోవడం లేదనే టాక్ వినిపిస్తుంది.మరి ఈ ఇద్దరు సీనియర్ లు వచ్చే నెల నుండి అయినా షూటింగ్ లో పాల్గొంటారేమో చూడాలి.
వీరి సినిమాల కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.వారి కోసం అయినా వీరు బరిలోకి దిగాలి.