తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుగా ఉన్నారు.తాను పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ తెలంగాణలో బాగా బలపడడం, కేంద్ర బీజేపీ పెద్దలు తమపై మరింత నమ్మకంతో ఉండడం, తన హయాంలోనే పార్టీ అధికారంలోకి వస్తుందని భావం ఉండడంతో సంజయ్ లో ఉత్సాహం రోజురోజుకు పెరుగుతోంది.
ఇప్పటికే ప్రజాసంఘాల యాత్ర పేరుతో తెలంగాణ అంతట పాదయాత్ర చేపడుతున్నారు.ప్రస్తుతం ఐదవ విడత పాదయాత్ర కొనసాగుతోంది.
సార్వత్రిక ఎన్నికలకు సమయం కూడా దగ్గరకు వచ్చేస్తుండడంతో, వీలైనంత త్వరగా యాత్రను ముగించాల్సిందిగా అధిష్టానం సూచించింది.దీంతో సంజయ్ ఆ పాదయాత్రను వీలైనంత త్వరగా ముగించే పనిలో ఉన్నారు.
ఇక ఆ యాత్ర ముగిసిన వెంటనే తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
సంక్రాంతి తరువాత బస్సు యాత్ర చేపట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు.
బస్సు యాత్ర ద్వారా ఆయా ప్రాంతాలను కవర్ చేసే విధంగా సంజయ్ ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం.ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తుండడంతోనే అధిష్టానం సూచనలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర నిర్మల్ జిల్లా లో ఉన్న సమయంలోనే ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ సంజయ్ చెప్పారు.ఐదు విడతల్లో భాగంగా ఇప్పటికే సగం నియోజకవర్గాలు మాత్రమే కావాలి అవడంతో మిగిలిన నియోజకవర్గం పాదయాత్ర ద్వారా కవర్ చేయడం సాధ్యం కాదనే ఆలోచనతోనే బస్సు యాత్రను చేపట్టాలని నిర్ణయించుకున్నారట.
మిగిలిన నియోజకవర్గాలు మొత్తం బస్సు యాత్ర ద్వారా చేపట్టి ఆ తర్వాత ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నం కావాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి ఆదిలాబాద్ ,నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో ఐదో విడత ప్రజా సంఘ్రమయాత్ర సాగుతోంది.అది ముగిసిన తర్వాత హైదరాబాద్ లో ఆరో విడత పాదయాత్ర చేపట్టేలా చేసుకుంటున్నారు.దీనిని వీలైనంత త్వరగా ముగించి బస్సు యాత్ర చేపట్టేందుకు ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు .ఈ విషయంలో కేంద్ర బిజెపి పెద్దలు కూడా సంజయ్ కు తగిన సూచనలు చేయడంతో ఆయన బస్సు యాత్రపై ఈ నిర్ణయం తీసుకున్నారట.