రకుల్ ప్రీత్.ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన రకుల్ ప్రీత్ ఆతర్వాత చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ వచ్చిన ఈ భామ ఒకేసారి మంచి ఫెమ్ సంపాదించింది.కరెంటు తీగా, వేంకటాద్రి ఎక్సప్రెస్ వంటి సినిమాలతో సూపర్ హిట్ కొట్టి టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.
అలా దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరి పక్కన నటించేసింది ఈ బ్యూటీ.
అక్కినేని నాగార్జున సరసన కూడా మన్మథుడు 2 సినిమాలో నటించింది ఈ బ్యూటీ.
ఇక ఇలా సినిమాలు చేస్తూనే సొంతంగా బిజినెస్ లు కూడా నడుపుతోంది ఈ భామ.ఇక ఈ నేపథ్యంలో రకుల్ ప్రీత్ ఇటీవల కరోనా బారిన పడింది.ఇప్పుడు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న రకుల్ తాను కరోనా వైరస్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది అనేది అనుభవాలను ఓ పత్రికతో పంచుకుంది.ప్రస్తుతం కుటుంబాన్ని కలిసిన ఆమె కరోనా సమయంలో ఎదుర్కొన్న విషయాలు అన్నింటిని చెప్పుకొచ్చింది.
గత కొన్ని నెలల నుంచి షూటింగ్స్ కోసం హైదరాబాద్ లోనే ఉంటున్నట్టు.చిత్రీకరణలో పాల్గొంటున్న సమయంలో ఓ రోజు చాలా అలసటగా ఉంటున్నట్టు అనిపించిందని .వరుస షూటింగ్స్ వల్ల నీరసంగా ఉందని అనుకున్నాను, అంతేకాదు మూడు రోజులకు ఒకసారి చిత్ర టీమ్ మొత్తం కోవిడ్-19 పరీక్షలు చేయించుకున్నటున్నాం కాబట్టి కరోనా వచ్చినట్లు అసలు బావించలేకపోయాం అని.కానీ ఆ రోజు కరోనా పరీక్షలో కోవిడ్ పాజిటివ్ రావడంతో షాక్ అయినట్టు ఆమె చెప్పుకొచ్చింది.ఇక ఆతర్వాత అంతా మంచే జరుగుతుందని భావించాను అని.అలానే ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నట్టు ఆమె ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.