సీనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో అన్నాదమ్ముల అనుబంధం సినిమా ఒకటనే సంగతి తెలిసిందే.ఈ సినిమాలో అన్నాదమ్ముల పాత్రల్లో సీనియర్ ఎన్టీఆర్, మురళీ మోహన్, బాలకృష్ణ నటించారు.
అయితే హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ గానిలిచిన యాదోం కీ బారత్ అనే సినిమాకు రీమేక్ గా అన్నాదమ్ముల అనుబంధం సినిమా తెరకెక్కింది.హిందీలో యాదోం కీ భారత్ 1973 సంవత్సరంలో విడుదల కాగా తెలుగులో అన్నాదమ్ముల అనుబంధం సినిమా 1975 సంవత్సరంలో విడుదలైంది.
ఈ సినిమాలోని పాటలు సైతం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.ఈ మూవీలోని ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే పాటను ప్రేక్షకులు తేలికగా మరిచిపోలేరు.
అయితే ఈ సినిమాలోని అన్నాదమ్ముల పాత్రలలో బాలయ్య నటించిన పాత్రకు మొదట చంద్రమోహన్ ఎంపికయ్యారు.ఈ సినిమా షూటింగ్ మొదలైన తర్వాత చంద్రమోహన్ కూడా షూటింగ్ కు వెళ్లారు.
అయితే కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఆ పాత్రను బాలకృష్ణతో చేయించారు.
తాను చేయాల్సిన పాత్రలో బాలకృష్ణ నటించడం, తనకు బదులుగా బాలయ్యను ఎంపిక చేసినట్టు చెప్పకపోవడంతో చంద్రమోహన్ చాలా హర్ట్ అయ్యారు.ఒక విధంగా తనను అవమానించారని చంద్రమోహన్ భావించడం గమనార్హం.అయితే ఆ సినిమాలో ఛాన్స్ పోయినా చంద్రమోహన్ కు మరో సినిమాలో నటించే అవకాశం మాత్రం దక్కింది.
అయితే సీనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఆఫర్ పోయినా ఎంజీఆర్ సినిమాలో తమ్ముడిగా నటించే పాత్ర చంద్రమోహన్ కు దక్కింది.
తమిళంలో కూడా ఎంజీఆర్ హీరోగా ఇదే సినిమా తెరకెక్కగా ఆ సినిమాలో చిన్న తమ్ముడి పాత్రలో చంద్రమోహన్ నటించారు.ఒక సందర్భంలో చంద్రమోహన్ స్వయంగా ఈ విషయాలను వెల్లడించారు.అలా తెలుగులో ఛాన్స్ మిస్సైనా తమిళంలో మాత్రం చంద్రమోహన్ అవకాశాన్ని సంపాదించుకున్నారు.