బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఏ విషయంలోనైనా ఎంతో సమయమనం పాటించి, ఎంతో ఓర్పుతో సహనంతో ఉంటారు.
ఎపుడు ఎంతో ప్రశాంతంగా మిస్టర్ కూల్ అనిపించుకున్న అమితాబచ్చన్ ఓ సందర్భంలో తన భార్య జయాబచ్చన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, గట్టిగా కేకలు వేస్తూ ఆమె పై విరుచుకు పడ్డాడని, ఒక ప్రముఖ జర్నలిస్ట్ వెల్లడించారు.ఎప్పుడూ ఎంతో ప్రశాంతంగా ఉండే అమితాబచ్చన్ తన భార్యను తిట్టడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే…
అమితాబచ్చన్ 50వ పుట్టినరోజు సందర్భంగా.
అమితాబ్ బచ్చన్ ఇంటిని సందర్శించి అమితాబ్ తన భార్య జయాబచ్చన్ ప్రతీక్షలో ఇంటర్వ్యూ చేశారు జర్నలిస్ట్ కరణ్ థాపర్.ఈ సందర్భంగా అమితాబచన్ తో మాట్లాడుతూ పెళ్లి తర్వాత మీకు ఎవరితోనైనా ఎఫైర్స్ ఉన్నాయా.? అని ప్రశ్నించగా అందుకు అమితాబచ్చన్ నో నెవర్ అంటూ సమాధానం చెప్పారు.ఇలా అమితాబచ్చన్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఇంటర్వ్యూలో తన అని అడిగినప్పుడు.
ఇలాంటి వార్తలను నేను విన్నాను కానీ ఆ వార్తలను రాయకుండా మనం ఆపలేం కదా అంటూ సమాధానం చెప్పారు.
ఇదే విషయంపై జయాబచ్చన్ ని అడగగా మా ఆయన అబద్ధం చెప్పడు తనకు ఎవరితోనూ సంబంధం లేదని నవ్వుతూ బదులిచ్చారు.ఇలా ఇంటర్వ్యూ అనంతరం అమితాబచ్చన్ కరణ్ బృందాన్ని భోజనం చేసి వెళ్లాల్సిందేనని ఆ దంపతులు పట్టుపట్టారు.ఈ క్రమంలోనే అందరూ కలిసి డైనింగ్ దగ్గరికి వెళ్లగా.
అక్కడ అమితాబచ్చన్ ఎవరూ ఊహించని విధంగా ఎప్పుడు చూడని విధంగా తన భార్య జయాబచ్చన్ పై గట్టిగా కేకలు వేశారు.
అమితాబ్ బచ్చన్ తన భార్య జయాబచ్చన్ పై కోపడటానికి గల కారణం ఆమె అన్నం తినమని అడిగినందుకే.నేను ఎప్పుడు రైస్ తిననని నీకు తెలుసు… నేను తినను అనే దానిని ఎందుకు తిను అంటున్నావు.అంటూ ఆమెను సీరియస్ గా తిట్టడంతో అతని అరుపులకు బెదిరిపోయిన జయా బచ్చన్ అక్కడ నుంచి తన గదికి వెళ్లి ఇక బయటకు రాలేదంటూ జర్నలిస్ట్ తను రాసిన ‘డెవిల్స్ అడ్వకేట్: ది అన్టోల్డ్ స్టోరీ‘ బుక్లో ఆయన వెల్లడించాడు.