ఎన్నో కొత్త ఫీచర్లను యూజర్లకు తీసుకు వస్తున్న వాట్సప్ షాకింగ్ విషయాన్ని చెప్పుకొచ్చింది.వాట్సప్ యూజర్లు అంతా కూడా వెంటనే తమ వాట్సన్ను ప్లేస్టోర్ లేదా ఆపిల్ స్టోర్లో అప్ డేట్ చేసుకోవాలని, లేదంటే పెద్ద ప్రమాదం అంటూ హెచ్చరించింది.
వాట్సప్కు కొత్త ఫీచర్లు యాడ్ చేస్తున్న సమయంలో ఇజ్రాయిల్కు చెందిన ఒక సంస్థ తయారు చేసిన వైరస్ అటాక్ అయ్యిందని, దాని వల్ల ఫోన్లోని వ్యక్తిగత సమాచారం అంతా కూడా దొంగిలించ బడుతుందని, దాంతో పాటు ఫోన్ హ్యాంగ్ అయ్యే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యల నుండి తప్పించుకోవాలంటే వెంటనే వాట్సప్ను అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
కొత్త వర్షన్ను మే 13వ తారీకున వాట్సప్ ప్లేస్టోర్లో ఉంచింది.ఒకటి రెండు రోజుల్లో సమస్యలు అన్ని కూడా తీరిపోతారు, వైరస్ నుండి తమ యూజర్లను కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వాట్సప్ యాజమాన్యం ప్రకటించింది.
వాట్సప్ ద్వారా ఇప్పటి వరకు ఎలాంటి వైరస్ అటాక్ కాలేదని, అయితే మొదటి సారి వాయిస్ కాల్ ద్వారా ఈ వైరస్ అటాక్ కాబోతున్నట్లుగా వారు ప్రకటించారు.
వాయిస్ కాల్స్ వచ్చినా, చేసినా, ఎవరైనా చేయగా రిసీస్ చేసినా, చేయకున్నా, మిస్డ్ కాల్ పడ్డా కూడా వైరస్ అనేది ఎటాక్ అవుతుందని ప్రకటనలో పేర్కొనడం జరిగింది.ప్రపచం వ్యాక్తంగా ఉన్న 150 కోట్ల యూజర్లు కూడా వెంటనే వాట్సప్ను అప్డేట్ చేసుకోవాలంటూ అధికారికంగా ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది.ప్రస్తుతం వాట్సప్లో ఎలాంటి కాల్స్ మాట్లాడకుండా ఉంటేనే బెటర్ అంటూ యూజర్లకు వాట్సప్ చెబుతోంది.
మీరు వాట్సప్ వినియోగదారులు అయితే వెంటనే మీ వాట్సప్ను అప్డేట్ చేసుకోండి.ఇదే సమయంలో మీరు మీ స్నేహితులకు వాట్సప్ ద్వారా దీన్ని షేర్ చేయండి.