వాట్సాప్ అంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి ఎంతగానో దగ్గరయిపోయింది.సామాన్య జనం కూడా వాట్సాప్ అంటే ఈజీగానే వాడేస్తున్నారు.
మిగతా యాప్ లకంటే కూడా ఈ సోషల్ మీడియా యాప్ అందరికీ బాగా దగ్గరయింది.ప్రతి చిన్న విషయానికి అందరూ వాట్సాప్ను వాడేస్తున్నారు.
మెసేజ్ చేసే దగ్గరి నుంచి ఫొటోలు, వీడియోలు పంపే వరకు అందరూ వాట్సాప్ నే నమ్ముకుంటున్నారు.అలాంటి వాట్సాప్ ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్స్ ను తీసుకొచ్చిన విషయం కూడా తెలిసిందే.
వాట్సాప్ లో పేమెంట్స్ ఆప్షన్ రీసెంట్ గా అందుబాటులోకి వచ్చేసింది.
అయితే ఈ వాట్సాప్ ద్వారా ట్రాన్సక్షన్ చేసుకునే కస్టమర్లను పెంచుకునేందుకు వాట్సాప్ ఇప్పుడు అదిరిపోయే ఆఫర్ను ప్రకటించింది.
తమ సంస్థపై నమ్మకం పెంచుకునేందుకు ఇప్పుడు క్యాష్ బ్యాక్ ఆఫర్ను అందిస్తున్నట్లు వివరించింది.వాట్సాప్ ద్వారా మనీ ట్రాన్సవర్ చేస్తే రూ.51 రూపాయల క్యాష్ బ్యాక్ ను అందిస్తున్నట్టు తెలిపింది.అయితే ఇందులో మరో విషయాన్ని కూడా వివరించింది.
ఇందులో కేవలం ఒక రూపాయి పంపింనా సరే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది వాట్సాప్.అయితే ఇందులో కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి.
వాట్సాప్ ద్వారా ఐదు ట్రాన్సాక్షన్ల వరకే ఈ ఆఫర్ వస్తుంది.ఆ తర్వాత చెల్లించే వాటికి మాత్రం ఈ ఆఫర్ వర్తించదని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.ఇక వాట్సాప్ ద్వారా వచ్చిన ఈ క్యాష్ బ్యాక్ వెంటనే మన అకౌంట్ లో జమ అవుతుంది.కాగా ఈ ఆఫర్ వర్తించాలంటే ఆరు ఆండ్రాయిడ్ బీటా యూజర్లు అయి ఉండాలి.
ఇక అతి త్వరలోనే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ను తీసుకొస్తున్నట్టు వాట్సాప్ వివరించింది.ఈ ఆఫర్ను చూస్తుంటే గతంలో ఫోన్ పే, గూగుల్ పే లు తీసుకొచ్చినవి గుర్తుకు రాక మానవు.
వారు కూడా ఇలాగే క్యాష్ బ్యాక్ ఆఫర్లను ఇచ్చారు.