భారత్ లో చాటింగ్ చేసుకోవడానికి ఎన్నో అప్లికేషన్లు అందుబాటులో ఉన్నా వాట్సాప్ యాప్ ను ఎక్కువ మంది ఉపయోగిస్తారు.అందువల్ల వాట్సాప్ కూడా భారత్ పై ఎక్కువగా దృష్టి పెడుతూ కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువరావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.
తాజాగా వాట్సాప్ భారత్ లోని వినియోగదారులకు శుభవార్త చెప్పింది.త్వరలో పేమెంట్ సర్వీసులను వాట్సాప్ మన దేశంలో ప్రారంభించనుంది.
మన దేశంలో పేమెంట్ సర్వీసుల కోసం ప్రధానంగా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీమ్, ఇతరత్రా యాప్స్ అందుబాటులో ఉన్నాయి.వాట్సాప్ పేమెంట్ సేవలు ప్రారంభమైతే ఈ యాప్ లను షాక్ తప్పదని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వాట్సాప్ లో పేమెంట్ సర్వీసులు ప్రారంభమైతే వినియోగదారులు ఇతర పేమెంట్ యాప్స్ పై ఆసక్తి చూపించే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
రిజర్వ్ బ్యాంక్ గతంలో పేమెంట్ సర్వీసులను అందించే వాళ్ల కోసం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.
వాట్సాప్ ఆర్బీఐ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉండటంతో ఈ యాప్ పేమెంట్ సర్వీసులపై నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ సైతం సదాభిప్రాయం వ్యక్తం చేస్తోంది.మన దేశంలోని వ్యాపార లావాదేవీల్లో సైతం డిజిటల్ ఇండియాలో భాగంగా వాట్సాప్ పెట్టుబడులు పెట్టే యోచనలో ఉందని సమాచారం.