యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరుత్సాహ పర్చింది.బాహుబలితో పాన్ ఇండియా క్రేజ్ను దక్కించుకున్న ప్రభాస్ ఈజీగా 500 కోట్లను రాబట్టడం ఖాయం అంటూ అంతా అనుకున్నారు.
కాని అనూహ్యంగా సాహో చిత్రం పెట్టిన పెట్టబడి విషయంలోనే ఇబ్బందులకు గురి చేసినట్లుగా సమాచారం అందింది.సాహో చిత్రం ఎఫెక్ట్ ప్రభాస్ తర్వాత సినిమా అయిన జాన్పై పడ్డట్లుగా సమాచారం అందుతోంది.
భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందుతున్న జాన్ చిత్రం స్క్రిప్ట్ను మార్చుతున్నట్లుగా తెలుస్తోంది.అలాగే బడ్జెట్ 150 కోట్ల నుండి 100 కోట్లకు తగ్గించినట్లుగా తెలుస్తోంది.ఫారిన్లో ఎక్కువ షూటింగ్ అనుకున్నప్పటికిబడ్జెట్ తగ్గించడంతో ఇప్పుడు ఇండియాలోనే ఎక్కువగా చిత్రీకరణకు ప్లాన్ చేస్తున్నారు.అన్ని విధాలుగా కూడా కాస్త తగ్గి మరీ జాన్ను చేయాలని నిర్ణయించుకున్నారు.
అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచక జరుగుతున్నాయి.
జాన్ చిత్రం షూటింగ్ కోసం ప్రభాస్ సిద్దం అవుతున్నాడు.సాహో చిత్రం షూటింగ్ పూర్తి కాకముందే జాన్ చిత్రం కూడా ప్రారంభించారు.అయితే సాహో చిత్రం ప్రమోషన్ కారణంగా రెండు నెలల గ్యాప్ తీసుకున్నాడు.
మళ్లీ అక్టోబర్ మొదటి లేదా రెండవ వారంలో జాన్ చిత్రీకరణ ప్రారంభం కాబోతుందని సమాచారం అందుతోంది.జిల్ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కృష్ణంరాజు నిర్మిస్తున్నాడు.
యూవీ క్రియేషన్స్ వంశీ మరియు ప్రమోద్లు కూడా సహ నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు.వచ్చే ఏడాది సమ్మర్ ఆరంభంలో జాన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.