ప్రస్తుత కాలంలో మనం జాగ్రత్తగా దాచి పెట్టుకున్న వస్తువే మన దగ్గర ఉండటం లేదు.ఇళ్ళను ఖాళీ చేస్తున్న పరిస్థితి ఉంది.
ఎక్కడైనా బయట ప్రదేశాల్లో ఏదైనా అంటే ఉదాహరణకు సెల్ ఫోన్ ను ఒక పది నిమిషాలు అలా వదిలేసి వెళ్తే అది మాయమైపోతుంది.ఎవరో ఒక మహాత్ముడు దానిని కాజేస్తాడు.
ఇంట్లో, బయట రక్షణ లేని పరిస్థితులలో ఓ వ్యక్తికి 53 ఏళ్ల క్రితం పోగొట్టుకున్న పర్సు దొరికింది.ఇక అతని ఆనందానికి అవధులు లేవనే చెప్పవచ్చు.
ఇక అసలు విషయంలోకి వస్తే కాలిఫోర్నియాలోని శాన్ డియోగోకు చెందిన గ్రిశామ్ అనే వ్యక్తి 1967 సంవత్సరంలో ఒక సంవత్సరం పాటు అంటార్కిటికాలోని రాస్ ద్వీపంలో శాస్త్ర వేత్తగా పనిచేసిన సమయంలో తన పర్సు పోగొట్టుకున్నట్టు గమనించాడు.కాని అది ఎంత వెతికిన దొరకకపోవడంతో ఇక వెతకడాన్ని ఆపేసాడు.
అయితే అంటార్కిటికా లోని రాస్ ఐల్యాండ్ లోని పాత భవనాల కూల్చివేతలో గ్రిశామ్ కు సంబంధించిన పర్సు లభించింది.ఇక స్పిరిట్ ఆఫ్ 45 అనే స్వచ్ఛంద సంస్థ గ్రిశామ్ ఆచూకీ కనుక్కొని పర్సును గ్రిశామ్ కు అందజేశారు.
ఇక 53 ఏళ్ల తరువాత పోగొట్టుకున్న పర్సు దొరకడంతో ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.