సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమా వంద కోట్లు.150 కోట్లు వసూళ్లు చేసింది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ప్రచారం చేస్తున్నారు.కానీ రియాల్టీకి వస్తే ఈ సినిమా ఇప్పటి వరకు చాలా ఏరియాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటుంది.
చాలా ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా చేరుకోవడం సాధ్యం కాదని అంటున్నారు.
సినిమాను మొదట 150 కోట్ల వరకు అన్ని ఏరియాలకు అమ్మేసినట్లుగా వార్తలు వచ్చాయి.
అంతటి భారీ వసూళ్లను రాబట్టటం సాధ్యమేనా అంటూ ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.సినిమా కనీసం 100 కోట్ల షేర్ ను కూడా రాబట్టగలడా అని ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
మహేష్ బాబు పై నమ్మకంతో మరో సారి బయ్యర్లు సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేశారు.
ఇప్పుడు సినిమాకు కలెక్షన్స్ ను చూస్తుంటే మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా ఆందోళనతో ఉన్నారు.సినిమా వసూళ్లు ఈ సారి దుమ్ము లేపడం ఖాయం అనుకున్నారు.కానీ సినిమా వసూళ్లు మాత్రం ఏమాత్రం ఆశాజనకంగా లేవు.
మహేష్ బాబు రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టడం ఖాయమని భావిస్తే ఇలా జరగడం చాలా బాధాకరం అంటూ సినీ వర్గాలు వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.