ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన ప్రవేశ బడ్జెట్ లో తెలంగాణకు నిధులు తగినంతగా కేటాయించలేదనే విషయం మనకు తెలిసిందే.గత కొన్ని దశాబ్దాలుగా వేచి చూస్తున్న సమస్యలకు ఇప్పటికి ఈ బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించని పరిస్థితి.
అయితే టీఆర్ఎస్ కు బీజేపీకి పెద్ద ఎత్తున మాటల తూటాలు పేలుతున్న పరిస్థితులలో బడ్జెట్ పై టీఆర్ఎస్ నేతల మౌనం ఇప్పుడు రాజకీయ వర్గాలను ఆశ్చారానికి గురి చేస్తున్నది.టీఆర్ఎస్ పార్టీ పై ఒంటి కాలి మీద లేస్తున్న బీజేపీపై బడ్జెట్ విషయంలో విమర్శించకుండా మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం అయితే మాత్రం ఇది కేసీఆర్ వ్యూహాత్మకంగానే బడ్జెట్ పై ఎటువంటి వ్యాఖ్యలు చేయడం లేదని సమయాన్ని బట్టి ఘాటుగా విమర్శించే అవకాశం ఉంది.కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే.
ఏ అస్త్రాన్ని ఎప్పుడు ఎక్కడ వాడాలో కేసీఆర్ కు తెలిసినంతగా ఎవరికి తెలిసి ఉండవు.ప్రతిపక్షాలకు కూడా అంతుపట్టని వ్యూహాలను రచిస్తూ కేసీఆర్ విజయం సాధిస్తూ ఉంటాడు.
ఇది ఎన్నో సార్లు రుజువైంది.చూద్దాం ఈ అస్త్రాన్ని కేసీఆర్ ఎలా ఉపయోగిస్తాడనేది చూడాల్సి ఉంది.