ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘సాహో’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంకు సెన్సార్ ఇటీవలే పూర్తయ్యింది.
సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు యూ/ఎ వచ్చింది.సెన్సార్ పూర్తి అయ్యి మూడు నాలుగు రోజులు అయ్యింది.
అయితే సెన్సార్ రిపోర్ట్ మాత్రం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది.సెన్సార్ సభ్యుల స్పందన ఏంటీ అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.
తాజాగా సెన్సార్ బోర్డు సభ్యులపై క్లారిటీ వచ్చేసింది.
సెన్సార్ బోర్డు సభ్యులు సాహో చూసిన తర్వాత ఇది తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా అని.ఇప్పటి వరకు తెలుగులో ఇలాంటి సినిమా రాలేదని బాలీవుడ్ మరియు హాలీవుడ్ స్టాండర్డ్స్తో ఈ చిత్రంను యూనిట్ సభ్యులు తెరకెక్కించారని చెప్పుకొచ్చారు.హిందీలోని ధూమ్ సిరీస్ స్థాయిలో సాహో చిత్రం ఉందనే నమ్మకంను వారు వ్యక్తం చేశారు.
మొత్తానికి సెన్సార్ సభ్యుల కామెంట్స్తో సినిమా స్థాయి చుక్కల్లో నిలిచినట్లయ్యింది.
ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రం కోసం ముంబయి, హైదరాబాద్ల మద్య చక్కర్లు కొడుతోంది.భారీ ఎత్తున అంచనాలున్న సాహో చిత్రంకు సెన్సార్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో కలెక్షన్స్ విషయంలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది.మొదటి రోజే 100 కోట్ల వసూళ్లు నమోదు చేసేలా ఓపెనింగ్స్ ఉండాలని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.
అయితే అది సాధ్యం అయ్యేనా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎందుకంటే బాలీవుడ్ సినిమాలకు సైతం ఆ మార్క్ అంత సులభం కాదు.